Nimmala Ramanaidu: ఇరిగేషన్ ప్రాజెక్ట్ల సీఈ, ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్స్.. మంత్రి ఆదేశాలు
- ఇరిగేషన్ ప్రాజెక్ట్ల సీఈ.. ఎస్ఈలతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్
- హాజరైన ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్.. ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు
- ప్రాజెక్టులు.. రిజర్వాయర్లు.. కాలువల అత్యవసర పనుల నిర్వహణకు
- ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన రూ. 284 కోట్లతో వెంటనే పనులు చేపట్టాలని ఆదేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ల సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల అత్యవసర పనుల నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన రూ. 284 కోట్లతో వెంటనే పనులు చేపట్టాలని మంత్రి ఆదేశం ఇచ్చారు. గత ఐదేళ్ళ జగన్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ల గేట్లు, షట్టర్లు, రోప్స్కు గ్రీజు వంటి వాటికి మరమ్మతులు మాట అటుంచి.. కనీసం గ్రీజు వంటి నిర్వహణ కూడా లేక ఇరిగేషన్ నిర్వీర్యం అయిపోయిందని ఆరోపించారు.
Read Also: War 2 Leaked Pic: యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్.. చూశారా?
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్ట్లలో అత్యవసరంగా చేపట్టాల్సిన 2,323 పనులకు వెంటనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. సాగు నీటి ప్రాజెక్టుల ఆపరేషన్, నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం రూ. 983 కోట్లు ఖర్చు పెట్టాల్సిఉండగా.. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం రూ. 275 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ ఏడాదికి అవసరం అయిన రూ. 983 కోట్లు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. పంట కాలువలు, డ్రైన్లు, రిజర్వాయర్లు నిర్వహణకు అవసరం అయిన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ మేనేజ్మెంట్ పద్ధతిన తీసుకోవాలని సీఎం సూచించారు.
Read Also: Dating Fraud: డేటింగ్ ఫ్రాడ్.. అమ్మాయి ఆర్డర్ చేసిన కూల్డ్రింక్ ధర రూ.16,400..
గత ప్రభుత్వ అసమర్థ విధానాలు, నిర్వహణా లోపాల కారణంగా.. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 467 లిఫ్ట్ స్కీంలు మూలన పడ్డాయని, ఈ కారణంగా 2.90 లక్షల ఎకరాల సాగు తగ్గిందని అధికారులు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న 8.11 లక్షల ఎకరాల సాగుకు అవసరం అయిన 1047 ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం, రిపేర్లు కోసం 10 ఏళ్లకు యాన్యుటీ పద్ధతిన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
తాజావార్తలు
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..