AP Liquor Case: ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు..
- ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు..
- ఇద్దరు నిందితులు ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారు..
- ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు..
- రాజ్కేసిరెడ్డికి సన్నిహితులు.. ముడుపుల బదిలీల్లో కీలక పాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు పేర్కొంది సిట్.. ఇద్దరు నిందితుల రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొన్న అంశాలు చర్చగా మారాయి.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారు.. ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నారు.. నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు, ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్కేసిరెడ్డికి సన్నిహితులు.. స్కాంలో వచ్చిన ముడుపులు వేరే వారికి బదిలీల్లో కీలక పాత్ర పోషించారని సిట్ పేర్కొంది..
Read Also: Manchu Vishnu : ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా.. మంచు విష్ణు కామెంట్స్..
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
ఇక, ఆర్థర్ ఆఫ్ సప్లై నిర్ణయాల్లో ఇతర నిందితులతో కలిసి ధనుంజయ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.. డిస్టలరీస్, మద్యం సరఫరాదారుల నుంచి ముడుపులు వసూలు చేసి ఇతర నిందితులతో పాటు అనేక మందికి బదిలీ చేశారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది సిట్.. అయితే, లిక్కర్ స్కాంలో ఏ1, ఏ1 సన్నిహితుల నుంచి డబ్బులు వసూలు చేసి.. చివరికి ఎవరికి చేర్చారో గుర్తించాల్సి ఉందన్నారు. ఇక, సిండికేట్ సభ్యుల సమావేశాల్లో పాల్గొని ముడుపులు సకాలంలో అందేలా చూశారు.. కేసులో ఏ1 రాజ్కేసిరెడ్డి, ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ4 మిథున్ రెడ్డి, ఏ5 విజయ సాయిరెడ్డి, ఏ3 సత్య ప్రసాద్లతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నారు.. ఏ1 రాజ్ కేసిరెడ్డి కార్యాలయానికి పదే పదే వెళ్లి ముడుపుల వసూళ్లను పర్యవేక్షించారు.. ముడుపుల వసూలుకు వ్యవస్థ సృష్టించి దాన్ని నడిపించారు.. అంతేకాదు.. ఆ ముడుపులు ఎక్కడ..? ఎలా..? పెట్టుబడులు పెట్టారో పూర్తి సమాచారం ఇద్దరి దగ్గర ఉందని సిట్ పేర్కొంది.. ముడుపులు డబ్బుతో ఖరీదైన ఆస్తులు, కార్లు కొన్నారు.. ఆ వివరాలు వెలికి తీయాల్సి ఉందన్నారు.
Read Also: India-Pakistan: పాకిస్థాన్పై దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం.. ఏడు అఖిలపక్ష బృందాల ఏర్పాటు..
లిక్కర్ స్కాం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని పేర్కొంది సిట్.. దీని కోసం ఇద్దరిని ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కనీసం 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్లో కోరింది సిట్.. కాగా, రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ వోఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు నిన్న సిట్ అధికారులు ప్రకటించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
-
Peddi Pre-Release Event : ‘పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో
-
Mamata Banerjee: “ఇక మేమేంటో చూపిస్తాం”.. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
-
LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
-
RCB vs GT Final: ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. ఐపీఎల్ 2026 విజేత ఎవరు?.. పూర్తి వివరాలు ఇవే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..