AP Liquor Case: ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు..
- ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు..
- ఇద్దరు నిందితులు ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారు..
- ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు..
- రాజ్కేసిరెడ్డికి సన్నిహితులు.. ముడుపుల బదిలీల్లో కీలక పాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు పేర్కొంది సిట్.. ఇద్దరు నిందితుల రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొన్న అంశాలు చర్చగా మారాయి.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారు.. ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నారు.. నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు, ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్కేసిరెడ్డికి సన్నిహితులు.. స్కాంలో వచ్చిన ముడుపులు వేరే వారికి బదిలీల్లో కీలక పాత్ర పోషించారని సిట్ పేర్కొంది..
Read Also: Manchu Vishnu : ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా.. మంచు విష్ణు కామెంట్స్..
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
ఇక, ఆర్థర్ ఆఫ్ సప్లై నిర్ణయాల్లో ఇతర నిందితులతో కలిసి ధనుంజయ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.. డిస్టలరీస్, మద్యం సరఫరాదారుల నుంచి ముడుపులు వసూలు చేసి ఇతర నిందితులతో పాటు అనేక మందికి బదిలీ చేశారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది సిట్.. అయితే, లిక్కర్ స్కాంలో ఏ1, ఏ1 సన్నిహితుల నుంచి డబ్బులు వసూలు చేసి.. చివరికి ఎవరికి చేర్చారో గుర్తించాల్సి ఉందన్నారు. ఇక, సిండికేట్ సభ్యుల సమావేశాల్లో పాల్గొని ముడుపులు సకాలంలో అందేలా చూశారు.. కేసులో ఏ1 రాజ్కేసిరెడ్డి, ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ4 మిథున్ రెడ్డి, ఏ5 విజయ సాయిరెడ్డి, ఏ3 సత్య ప్రసాద్లతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నారు.. ఏ1 రాజ్ కేసిరెడ్డి కార్యాలయానికి పదే పదే వెళ్లి ముడుపుల వసూళ్లను పర్యవేక్షించారు.. ముడుపుల వసూలుకు వ్యవస్థ సృష్టించి దాన్ని నడిపించారు.. అంతేకాదు.. ఆ ముడుపులు ఎక్కడ..? ఎలా..? పెట్టుబడులు పెట్టారో పూర్తి సమాచారం ఇద్దరి దగ్గర ఉందని సిట్ పేర్కొంది.. ముడుపులు డబ్బుతో ఖరీదైన ఆస్తులు, కార్లు కొన్నారు.. ఆ వివరాలు వెలికి తీయాల్సి ఉందన్నారు.
Read Also: India-Pakistan: పాకిస్థాన్పై దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం.. ఏడు అఖిలపక్ష బృందాల ఏర్పాటు..
లిక్కర్ స్కాం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని పేర్కొంది సిట్.. దీని కోసం ఇద్దరిని ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కనీసం 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్లో కోరింది సిట్.. కాగా, రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ వోఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు నిన్న సిట్ అధికారులు ప్రకటించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!