Liquor Sales: మందుబాబుల్లో కొత్త టెన్షన్.. ఎక్సైజ్ శాఖకు షాక్..!
- కల్తీ మద్యం షాక్తో మందుబాబుల్లో టెన్షన్ ..
- గ్లాస్ ఎత్తేందుకు జంకుతున్న మందుబాబులు..
- తమ ప్రాంతంలో నకిలీ మద్యం సరఫరా జరిగిందేమోఅని ఆందోళన..
- పడిపోయిన రాష్ట్ర మద్యం రెవెన్యూ..
- అమ్మకాలపై గట్టి ప్రభావం చూపిస్తున్న నకిలీ మద్యం ఉదంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Sales: మందుబాబల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.. కల్తీ మద్యం ఎఫెక్ట్.. ప్రభుత్వం ఖజానాకు గట్టిగానే షాకిస్తోంది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో రోజుకు సగటున 78 నుంచి 80 కోట్లు వరకు ఎక్సైజ్ రెవిన్యూ వస్తుంది. అయితే.. కొన్ని రోజులుగా కల్తీ మద్యం భయంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. కొన్ని జిల్లాల్లో రెవిన్యూ డ్రాప్ తీవ్రంగా నమోదైనట్టు సమాచారం. మద్యం దుకాణాల వద్ద రద్దీ తగ్గిపోగా, నకిలీ బ్రాండ్ల భయంతో కొంతమంది వినియోగదారులు పూర్తిగా మద్యం కొనడం మానేశారు. దీంతో రోజువారీ రెవిన్యూ లోటుతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గట్టి దెబ్బ తగిలింది.
Read Also: Minister Satya Kumar Yadav: ప్రపంచమంతా మళ్లీ భారతీయ వైద్య విధానం వైపు..
Also Read
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
కొన్ని ప్రాంతాల్లో నకిలీ మద్యం మూలాలు బయటపడుతుండటంతో ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయ్యింది. ల్యాబ్స్, గోడౌన్స్ గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు అధికారులు. వైన్ షాప్స్ పై ఆకస్మిక తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. అనుమానం ఉన్న ప్రాంతాల్లో దాడులు చేస్తూ .. నకిలీ మద్యం లిక్కర్ నెట్వర్క్ గుర్తించేందుకు చర్యలు చేపట్టింది ఎక్సైజ్ శాఖ.ప్రజలకు బ్రాండెడ్, నాణ్యమైన మద్యం మాత్రమే వినియోగించాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు వైన్ షాప్స్, బార్స్ దగ్గర వాతావరణం పూర్తిగా మారిపోయింది.మందుబాబులు.. గ్లాస్ ఎత్తడానికి ముందు ఒకటి, రెండుసార్లు ఆలోచిస్తున్నారు. భయంతో మద్యం వినియోగం తగ్గిపోవడం.. అమ్మకాలపై గట్టి ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా..చిన్న బార్స్, బెల్ట్ షాప్స్ దగ్గర సేల్స్ దారుణంగా తగ్గాయి.ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గిపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేల్స్ పడిపోవడంతో వైన్ షాప్స్ యజమానులు కూడా ఇబ్బందుల్లో పడ్డారు. నకిలీ మద్యం ఎఫెక్ట్తో మద్యం మార్కెట్పైనా గట్టి ప్రభావమే చూపుతోంది. మందుబాబుల సర్కిల్స్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఏది ఒరిజినల్, ఏది నకిలీ అని ఆలోచిస్తున్నారు లిక్కర్ ప్రియులు.
కాగా, కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏ1 అద్దేపల్లి జనార్ధన్ చుట్టూ లోతైన విచారణ చేపట్టారు. జనార్ధన్ కు చెందిన ఏఎన్ఆర్ బార్ లైసెన్స్ ను ఇప్పటికే సస్పెండ్ చేశారు కూడా. మరోవైపు భవానీపురం శ్రీనివాస్ వైన్స్ లో కూడా కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే బార్ లైసెన్స్ దారుడిని విచారణ జరిపారు పోలీసులు. బార్ మేనేజర్ గా పనిచేసిన కళ్యాణ్ వారానికి 15 కేసులు చొప్పున అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. కళ్యాణ్ తో పాటు ఖాళీ బాటిల్స్ సరఫరా చేసిన శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో అరెస్టుల సంఖ్య ఐదుకు చేరుకుంది. మిగిలిన నిందితుల కోసం అధికారులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
-
Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడుల జోరు.. ఇన్వెస్ట్ తెలంగాణకు వార్ రూమ్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..