Liquor Sales: మందుబాబుల్లో కొత్త టెన్షన్.. ఎక్సైజ్ శాఖకు షాక్..!
- కల్తీ మద్యం షాక్తో మందుబాబుల్లో టెన్షన్ ..
- గ్లాస్ ఎత్తేందుకు జంకుతున్న మందుబాబులు..
- తమ ప్రాంతంలో నకిలీ మద్యం సరఫరా జరిగిందేమోఅని ఆందోళన..
- పడిపోయిన రాష్ట్ర మద్యం రెవెన్యూ..
- అమ్మకాలపై గట్టి ప్రభావం చూపిస్తున్న నకిలీ మద్యం ఉదంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Sales: మందుబాబల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.. కల్తీ మద్యం ఎఫెక్ట్.. ప్రభుత్వం ఖజానాకు గట్టిగానే షాకిస్తోంది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో రోజుకు సగటున 78 నుంచి 80 కోట్లు వరకు ఎక్సైజ్ రెవిన్యూ వస్తుంది. అయితే.. కొన్ని రోజులుగా కల్తీ మద్యం భయంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. కొన్ని జిల్లాల్లో రెవిన్యూ డ్రాప్ తీవ్రంగా నమోదైనట్టు సమాచారం. మద్యం దుకాణాల వద్ద రద్దీ తగ్గిపోగా, నకిలీ బ్రాండ్ల భయంతో కొంతమంది వినియోగదారులు పూర్తిగా మద్యం కొనడం మానేశారు. దీంతో రోజువారీ రెవిన్యూ లోటుతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గట్టి దెబ్బ తగిలింది.
Read Also: Minister Satya Kumar Yadav: ప్రపంచమంతా మళ్లీ భారతీయ వైద్య విధానం వైపు..
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
కొన్ని ప్రాంతాల్లో నకిలీ మద్యం మూలాలు బయటపడుతుండటంతో ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయ్యింది. ల్యాబ్స్, గోడౌన్స్ గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు అధికారులు. వైన్ షాప్స్ పై ఆకస్మిక తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. అనుమానం ఉన్న ప్రాంతాల్లో దాడులు చేస్తూ .. నకిలీ మద్యం లిక్కర్ నెట్వర్క్ గుర్తించేందుకు చర్యలు చేపట్టింది ఎక్సైజ్ శాఖ.ప్రజలకు బ్రాండెడ్, నాణ్యమైన మద్యం మాత్రమే వినియోగించాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు వైన్ షాప్స్, బార్స్ దగ్గర వాతావరణం పూర్తిగా మారిపోయింది.మందుబాబులు.. గ్లాస్ ఎత్తడానికి ముందు ఒకటి, రెండుసార్లు ఆలోచిస్తున్నారు. భయంతో మద్యం వినియోగం తగ్గిపోవడం.. అమ్మకాలపై గట్టి ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా..చిన్న బార్స్, బెల్ట్ షాప్స్ దగ్గర సేల్స్ దారుణంగా తగ్గాయి.ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గిపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేల్స్ పడిపోవడంతో వైన్ షాప్స్ యజమానులు కూడా ఇబ్బందుల్లో పడ్డారు. నకిలీ మద్యం ఎఫెక్ట్తో మద్యం మార్కెట్పైనా గట్టి ప్రభావమే చూపుతోంది. మందుబాబుల సర్కిల్స్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఏది ఒరిజినల్, ఏది నకిలీ అని ఆలోచిస్తున్నారు లిక్కర్ ప్రియులు.
కాగా, కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏ1 అద్దేపల్లి జనార్ధన్ చుట్టూ లోతైన విచారణ చేపట్టారు. జనార్ధన్ కు చెందిన ఏఎన్ఆర్ బార్ లైసెన్స్ ను ఇప్పటికే సస్పెండ్ చేశారు కూడా. మరోవైపు భవానీపురం శ్రీనివాస్ వైన్స్ లో కూడా కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే బార్ లైసెన్స్ దారుడిని విచారణ జరిపారు పోలీసులు. బార్ మేనేజర్ గా పనిచేసిన కళ్యాణ్ వారానికి 15 కేసులు చొప్పున అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. కళ్యాణ్ తో పాటు ఖాళీ బాటిల్స్ సరఫరా చేసిన శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో అరెస్టుల సంఖ్య ఐదుకు చేరుకుంది. మిగిలిన నిందితుల కోసం అధికారులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?