Minister Atchannaidu: టీడీపీ ఆఫీస్పై దాడిని అందరూ చూశారు.. వంశీ అరెస్ట్లో రహస్యం ఏమీలేదు..
- వల్లభనేని వంశీ అరెస్ట్పై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు..
- గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిని అందరూ చూశారు..
- దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరిగింది.. రహస్యం ఏమీ లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అక్రమం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.. తప్పుడు కేసులు బనాయించి.. అరెస్ట్ చేశారని ఫైర్ అవుతున్నారు.. అయితే, వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్పై స్పందించిన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిని అందరూ చూశారని గుర్తుచేసిన ఆయన.. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరిగింది.. ఇందులో ఎలాంటి రహస్యం లేదని స్పష్టం చేశారు.. అయితే, ఫిర్యాదు చేసిన వ్యక్తి కేసును విత్డ్రా చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.. పార్టీ కార్యాలయంలో పని చేసిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఇలా జరుగుతుందా..? వాళ్ల కుటుంబంపై ఎంత ఒత్తిడి తెచ్చిఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Delhi New CM: ఢిల్లీ సీఎం ఎంపికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
ఇక, దాడికి ప్రతి దాడి చేయాలంటే 8 నెలలు కావాలా…? అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.. గత ఐదేళ్లలో ఇలా జరిగి రాష్ట్రం నష్టపోయిందన్న ఆయన.. కార్యకర్తలు బూతులు తిట్టినా కూడా.. దాడికి ప్రతిదాడి మంచి విధానం కాదు అని హితవుచెప్పారు.. అలా అని చేతులు కట్టుకుని ఉండబోమని వార్నింగ్ ఇచ్చారు.. ఎవరు తప్పు చేసినా.. వదిలే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.. ఇప్పుడు అదే జరుగుతోందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. కాగా, హైదరాబాద్లో అరెస్ట్ చేసిన వల్లభనేని వంశీని విజయవాడకు తరలించిన పోలీసులు.. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అనేక కోణాల్లో సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు పోలీసులు.. టీడీపీ గన్నవరం కార్యాలయంపైన దాడి గురించి ప్రశ్నిస్తున్నారు పోలీసులు.. దాడిలో ఎంత మంది పాల్గొన్నారు.. దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందనే కోణంలో వంశీని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ GGHకు వంశీని తరలించనున్నారు పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ SC,ST కోర్టులో హాజరు పర్చనున్నారు..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!