Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామలు.. అటు హైకోర్టు.. ఇటు ఎస్సీ, ఎస్టీ కోర్టు..!
- వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు..
- పలు పిటిషన్లపై బెజవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ..
Vallabhaneni Vamsi Case: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వల్లభనేని వంశీకి సంబంధించిన పలు పిటిషన్ల మీద బెజవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయటంతో విచారణ జరిపారు. ఇంటి భోజనం, జైలులో సౌకర్యాలు కల్పించాలని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపారు. కేసుకు సంబంధించి వంశీ కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ కూడా కోర్టులో దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై విచారణ గురువారానికి వాయిదా పడింది. మరోవైపు వల్లభనేని వంశీ పిటిషన్ పై రేపు తీర్పు వెలువరించనుంది ఏపీ హైకోర్టు..
Read Also: Odela 2: మహా కుంభమేళాలో ‘ఓదెల 2’ టీజర్ లాంఛ్
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టులో వాదనలు జరిగాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కుట్రలో ఇతరుల పాత్ర తెలుసుకోవటం కోసం, నిందితులు వినియోగించిన బ్లాక్ క్రెటా కారును గుర్తించటం, వంశీ ఫోన్ సీజ్ చేయటం కోసం కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వం వాదనలు వినిపించింది. సత్యవర్ధన్ పోలీసుల అదుపులో ఉన్నాడని, అతనే అన్ని వివరాలు చెబుతాడు కాబట్టి వంశీ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు వంశీ తరపున న్యాయవాదులు. ఇక వంశీ కూడా కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ ను దాఖలు చేశారు. సత్యవర్ధన్ కేసుతో తనకు సంబంధంలేదని, పోలీసులకు ఈ కేసు గురించి చెప్పటానికి తన దగ్గర ఏం లేదని అఫిడవిట్ ఇచ్చారు వంశీ. సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు అనే విషయాలను సీన్ రీ కన్ స్ట్రక్షన్ కూడా అతనితో చేసుకోవచ్చని వంశీ అఫిడవిట్ లో తెలిపారు. ఇక వంశీకి భోజనం, జైల్లో సదుపాయాల కల్పించాలని పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తి జైల్లో పరిస్థితులపై వంశీ నుంచి లెటర్ రూపంలో వివరాలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.
Read Also: South Central Railway: చర్లపల్లి టర్మినల్ నుంచి ధానాపూర్ కు ప్రత్యేక రైళ్లు
మరోవైపు, వంశీకి బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయటానికి న్యాయస్థానానికి సమయం కోరింది. బెయిల్ పిటిషన్ పై వాదనలు జరపటానికి ప్రత్యేక పీపీని నియమిస్తున్న కారణంగా కౌంటర్ దాఖలు చేయటం కోసం సమయం కోరటంతో రెండు రోజులు సమయం ఇస్తూ న్యాయమూర్తి వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్ లో వంశీ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అరెస్టు సమయంలో వంశీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే మాత్రమే సీజ్ చేయాలని, అరెస్ట్ సమయంలో సెల్ ఫోన్ లేకపోతే అవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పు ఉందన్నారు. కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉంటే ఇంకా వంశీ కస్టడీతో అవసరం లేదన్నారు పొన్నవోలు. ఇక, వల్లభనేని వంశీ పిటిషన్ పై రేపు తీర్పు వెలువరించనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. ఇప్పటికే విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసింది న్యాయస్థానం.. రేపు ఈ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు..
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!