AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు..
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో పలు కీలక పరిణామాలు..
- ఓవైపు కీలక వ్యక్తుల విచారణ..
- మరోవైపు ఏసీబీ కోర్టులో పిటిషన్లు..
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో ఈ రోజు పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు PLR ప్రాజక్ట్స్ ఎండీ చెవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివా రెడ్డి. లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత PLR సంస్థ ప్రతినిధులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది సిట్. లిక్కర్ స్కాం కేసులో PLR సంస్థ ఖాతాల్లోకి డబ్బు బదిలి అయినట్లు మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది సిట్.. PLR ప్రాజక్ట్స్ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు సిట్ అధికారులు.. కాగా, PLR ప్రాజెక్ట్స్ ఎంపీ మిథున్ రెడ్డికి చెందినది..
Read Also: AP Cabinet Decisions: మరో ముఖ్యమైన హామీ అమలు సిద్ధమైన ప్రభుత్వం.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
మరోవైపు, లిక్కర్ స్కాం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై ఏసీబీ ప్రత్యేక న్యాస్థానంలో వాదనలు ముగిశాయి.. ఈ నెల 12వ తేదీన తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు.. ఈ కేసులో ఏ31గా ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాజీ OSD కృష్ణ మోహన్ రెడ్డి.. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఇద్దరు నిందితులు.. ఇక, ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చుక్కెదురైంది.. స్విమ్స్ లో వైద్యం చేయించుకోవటం కోసం అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది ఏసీబీ కోర్టు.. మరోవైపు, జైలుకి ఇంటి భోజనం అనుమతించాలని చెవిరెడ్డి
పిటిషన్ పై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. వారంలో మూడు రోజుల పాటు ఇంటి భోజనం పంపటానికి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం.. లిక్కర్ కేసులో ఏ38గా ఉన్నారు చెవిరెడ్డి.. మరోవైపు, మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రాజ్ కేసిరెడ్డి.. లిక్కర్ స్కాం కేసులో ఏ1గా ఉన్నాడు రాజ్ కేసిరెడ్డి.. ఈ నెల 11న విచారణ చేపట్టనుంది ఏసీబీ కోర్టు.. ఇప్పటికే ఒకసారి రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో