Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు..
- వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు..
- ఇప్పటికే అరెస్ట్ అయ్యి విజయవాడ జైలులో ఉన్న వంశీ..
- ఎస్సీ, ఎస్టీ కోర్టుతో పాటు హైకోర్టులో బెయిల్ పిటిషన్లు..
- కీలకంగా మారుతున్న సత్యవర్ధన్ స్టేట్ మెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi Case: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామలు చోటు చేసుకున్నాయి.. సత్య వర్ధన్ ను రెండవ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి తీసుకెళ్లారు పటమట పోలీసులు.. మెజిస్ట్రేట్ ఎదుట సత్య వర్ధన్ 164 స్టేట్ మెంట్ రికార్డు చేశారు.. టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి కేసులో ఈ నెల 10వ తేదీన సత్యవర్ధన్ కేసు వాపస్ తీసుకున్న విషయం విదితమే కాగా.. కేసు వెనక్కి తీసుకోవాలని వంశీ.. సత్యవర్ధన్ ను బెదిరించారని నమోదైన కేసులో తాజాగా మరోసారి మెజిస్ట్రేట్ ఎదుట సత్యవర్ధన్ స్టేట్ మెంట్ రికార్డు చేశారు..
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
మరోవైపు.. వల్లభనేని వంశీ మోహన్ కేసులో కస్టడీ, బెయిల్ పిటిషన్లు విచారణకు స్వీకరించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు.. అనారోగ్యం కారణంగా బెడ్ తోపాటు ఇంటి నుండి ఆహారం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని దాఖలైన పిటిషన్ కూడా విచారణకు స్వీకరించింది న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో ఇరు పక్షాలు నోటీసులు జారీ చేయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.. ఇక, సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని పదిరోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. అయితే, రిమాండ్ లో ఉన్న వంశీకి బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు వంశీ తరపు న్యాయవాదులు.. నోటీసులపై రేపు కౌంటర్ దాఖలు చేయనున్నాయి ఇరు వర్గాలు..
Read Also: Hyderabad: ‘మీ ఆవిడని నాకిచ్చేయ్’.. ప్రియురాలి భర్తతో ప్రియుడు గొడవ
ఇక, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రంగబాబు అనే వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు వంశీ.. ఈ పిటిషన్ హైకోర్టు రేపు విచారణ జరిపే అవకాశం ఉంది.. మరోవైపు.. రేపు వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. విజయవాడ జిల్లా జైలులో కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని ఆయన రేపు కలుస్తారు.. ఇప్పటికే వంశీ భార్య పంకజశ్రీని ఫోన్లో పరామర్శించిన జగన్ ఆమెకు భరోసా ఇచ్చారు.. వంశీ అరెస్ట్ రోజు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు జగన్.. రేపు ఉదయం 10.30కి పలువురు వైసీపీ నేతలతో కలసి ఆయన జైలుకు వెళ్లి ములాఖత్ లో వంశీని పరామర్శించనున్నారు.. మొత్తంగా వల్లభనేని వంశీ కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి..
తాజావార్తలు
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!