Free Bus Travel In AP: ట్రాన్స్ జెండర్లకు కూడా ఫ్రీ బస్సు.. ఆ ఒక్క రూట్లో డబ్బులు కట్టాల్సిందే..
- ఆగస్టు 15 నుంచి ఏపీలో ఫ్రీ బస్సు పథకం అమలు..
- ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం..
- ఘాట్ రోడ్డులో ప్రయాణించే బస్సుల్లో ఉచితం లేదు: ఏపీఎస్ఆర్టీసీ ఎండీ
Free Bus Travel In AP: రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. జీరో టికెట్ విధానం అమలు చేస్తాం.. జిల్లాలు ధాటి ప్రయాణం చేసేందుకు ఉచిత బస్సులలో అనుమతి ఉంటుంది.. ఏసీ బస్సులు, కొన్ని సేవలు మినహాయిస్తే అన్ని బస్సుల్లోనూ మహిళలకు ఉచిత రవాణా లభిస్తుందన్నారు. ఆక్యుపెన్సీ 100శాతం పెరిగిపోయే అవకాశం ఉంది.. బస్సుల నిర్వహణ, అవసరాలకు తగ్గట్టుగా బస్సులను రెడీ చేశాం.. టిక్కెట్లు జారీ చేసినప్పుడు మొత్తం టికెట్ ధర.. కాన్సేషన్ పోగా జీరో ఫెయిర్ గా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.. వెయ్యి అదనపు బస్సులు అందుబాటు లోకి వచ్చాయి.. త్వరలో పల్లె వెలుగు ఏసీ, సిటీ ఆర్డినరీ ఏసీ ఎలక్ట్రిక్బస్సులు ప్రవేశ పెడతామని ద్వారాక తిరుమలరావు చెప్పుకొచ్చారు.
Read Also: Minister Satya Prasad: పవన్ ఏం అయ్యారో.. ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు..
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
అయితే, ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావు పేర్కొన్నారు. ఆధార్ లేదా గుర్తింపు కార్డు తీసుకుని రావడం తప్పనిసరి.. భవిషత్తులో స్మార్ట్ కార్డ్స్ ఇచ్చే ఆలోచన ఉంది.. ఏపీ మహిళలు అయితే ఉచిత బస్సుకు అర్హులు అని తెలిపారు. ఫ్రీ బస్సు విధానం వల్ల మెయింటనెన్స్ భారం పడుతుంది.. రోజూ 89 లక్షల మంది ప్రయాణీకులు ఆర్టీసీలో జర్నీ చేస్తారు.. ప్రస్తుతం 15 లక్షల మంది మహిళలు రోజూ ఆర్టీసీలో ప్రయాణిస్తుండగా.. ఉచిత విధానంతో 26 లక్షలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. అయితే, తిరుపతి – తిరుమల వెళ్ళే సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో మాత్రం ఉచిత ప్రయాణం ఉండదని తేల్చి చెప్పారు. ఘాట్ రోడ్డులో రాకపోకలు కొనసాగించే బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం లభించదని ద్వారక తిరుమలరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: టీఎంసీ ఓడిపోలేదు.. విలన్లతో పోరాడింది.. మమత సంచలన ఆరోపణలు
-
TVK Vijay: దళపతి విజయ్ కులం ఏంటి..? గూగుల్లో తెగ వెతికేస్తున్నారుగా..
-
TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక నిర్ణయం.. ఏ పార్టీలతో వెళ్లబోతున్నారంటే..!
-
Krishna Deer Hunting : కృష్ణ జింకల వేట.. ముగ్గురు నిందితుల అరెస్ట్..!
-
Vijay TVK: విజయ్ డూప్’తో సీఎంను ఓడించిన బాబు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!