Free Bus Travel In AP: ట్రాన్స్ జెండర్లకు కూడా ఫ్రీ బస్సు.. ఆ ఒక్క రూట్లో డబ్బులు కట్టాల్సిందే..
- ఆగస్టు 15 నుంచి ఏపీలో ఫ్రీ బస్సు పథకం అమలు..
- ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం..
- ఘాట్ రోడ్డులో ప్రయాణించే బస్సుల్లో ఉచితం లేదు: ఏపీఎస్ఆర్టీసీ ఎండీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Bus Travel In AP: రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. జీరో టికెట్ విధానం అమలు చేస్తాం.. జిల్లాలు ధాటి ప్రయాణం చేసేందుకు ఉచిత బస్సులలో అనుమతి ఉంటుంది.. ఏసీ బస్సులు, కొన్ని సేవలు మినహాయిస్తే అన్ని బస్సుల్లోనూ మహిళలకు ఉచిత రవాణా లభిస్తుందన్నారు. ఆక్యుపెన్సీ 100శాతం పెరిగిపోయే అవకాశం ఉంది.. బస్సుల నిర్వహణ, అవసరాలకు తగ్గట్టుగా బస్సులను రెడీ చేశాం.. టిక్కెట్లు జారీ చేసినప్పుడు మొత్తం టికెట్ ధర.. కాన్సేషన్ పోగా జీరో ఫెయిర్ గా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.. వెయ్యి అదనపు బస్సులు అందుబాటు లోకి వచ్చాయి.. త్వరలో పల్లె వెలుగు ఏసీ, సిటీ ఆర్డినరీ ఏసీ ఎలక్ట్రిక్బస్సులు ప్రవేశ పెడతామని ద్వారాక తిరుమలరావు చెప్పుకొచ్చారు.
Read Also: Minister Satya Prasad: పవన్ ఏం అయ్యారో.. ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు..
Also Read
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
- Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
అయితే, ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావు పేర్కొన్నారు. ఆధార్ లేదా గుర్తింపు కార్డు తీసుకుని రావడం తప్పనిసరి.. భవిషత్తులో స్మార్ట్ కార్డ్స్ ఇచ్చే ఆలోచన ఉంది.. ఏపీ మహిళలు అయితే ఉచిత బస్సుకు అర్హులు అని తెలిపారు. ఫ్రీ బస్సు విధానం వల్ల మెయింటనెన్స్ భారం పడుతుంది.. రోజూ 89 లక్షల మంది ప్రయాణీకులు ఆర్టీసీలో జర్నీ చేస్తారు.. ప్రస్తుతం 15 లక్షల మంది మహిళలు రోజూ ఆర్టీసీలో ప్రయాణిస్తుండగా.. ఉచిత విధానంతో 26 లక్షలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. అయితే, తిరుపతి – తిరుమల వెళ్ళే సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో మాత్రం ఉచిత ప్రయాణం ఉండదని తేల్చి చెప్పారు. ఘాట్ రోడ్డులో రాకపోకలు కొనసాగించే బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం లభించదని ద్వారక తిరుమలరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్నెస్కు ఫ్యాన్స్ ఫిదా!
-
Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
-
Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?