Vadde Shobhanadreeswara Rao: అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- అమరావతికి రెండో విడత భూ సమీకరణ పై రౌండ్ టేబుల్ సమావేశం..
- మొదటి విడతలో భూములు హమీ ఇచ్చిన విధంగా అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెట్టాలి..
- అమరావతిని సింగపూర్ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ లో లోపం ఉంది..
- ఇది వాస్తవమేనా అనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచన చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vadde Shobhanadreeswara Rao: అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వడ్డే వడ్డే శోభనాద్రీశ్వర రావు.. అమరావతి రెండో విడత భూ సమీకరణపై రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు, సీపీఎం నేత బాబురావు, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సీపీఐ నేత వనజ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రభుత్వం ముందుగా మొదటి విడతలో తీసుకున్న భూములపై ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 16 వేల ఎకరాలు అదనంగా తీసుకోవాలన్న నిర్ణయం ఆలోచనారాహిత్యంగా ఉంది అన్నారు. సింగపూర్ తయారు చేసిన మాస్టర్ ప్లాన్లో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమరావతి భవిష్యత్ GDP ₹3 లక్షల కోట్లు అవుతుందని సింగపూర్ తెలిపిందేమో గానీ, ఆ అంచనాపై ప్రభుత్వం ఎప్పుడూ విమర్శనాత్మకంగా ఆలోచించలేదని విమర్శించారు..
Read Also: Palnadu Crime: పల్నాడులో తల్లీకొడుకుల మృతి కలకలం.. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ..?
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
పచ్చని పంట భూముల నాశనం.. రైతుల నమ్మకం భంగం
అమరావతిలో సంపన్నమైన వ్యవసాయ భూములు నాశనం అయ్యాయని, రైతులు ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చినప్పటికీ వారి ప్రయోజనాలను కాపాడే బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించలేదని తీవ్ర విమర్శలు చేశారు వడ్డే.. మూడు ఏళ్లలో మౌలిక సదుపాయాలు అందిస్తామని అగ్రిమెంట్ చేసినా, ఇప్పటివరకు అవి అమలు కాలేదని అన్నారు. 2 వేల మందికి పైగా రైతులు ఇంకా ఫ్లాట్లు కూడా పొందలేదని పేర్కొన్నారు. కొందరికి ఇచ్చిన ఫ్లాట్లకు వెళ్లడానికి దారి కూడా లేదని విమర్శించారు.
రాజధాని రైతులపై కేసులు ఎందుకు నిలిచిపోతున్నాయి?
రాజధాని రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఇంకా తొలగించలేదని, ఇదే సమయంలో గత ప్రభుత్వంలో జరిగిన ఘటనలు అయితే వెంటనే కేసులు తీసేసిన ఉదాహరణలను గుర్తు చేశారు వడ్డే శోభనాద్రీశ్వర రావు.. “ఐకానిక్ టవర్లు”– “గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్”– “ఒలింపిక్ సిటీ” : కేవలం కలలేనా? అని ప్రశ్నించారు.. అమరావతిలో 2 లక్షల జనాభా కూడా లేకపోయినా, 1000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మిస్తామని చెప్పడం అభ్యంతరకరమన్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు 2500 ఎకరాలు కావాలని చెప్పి ఇప్పుడు 5000 ఎకరాలు కావాలనడం అసంబద్ధమన్నారు. నవ నగరాల్లో ఇప్పటికే 4000 ఎకరాలు కేటాయించి మళ్లీ పరిశ్రమల పేరుతో ఉన్న భూములను తీసుకోవడం ప్రజలకు భారమని అన్నారు. ఒలింపిక్ క్రీడల నిర్వహణ కోసం మరో 4000 ఎకరాలు కావాలని చెప్పడం ప్రజల డబ్బుతో ‘పగటి కలలు’ కంటున్నట్టేనన్నారు అని మండిపడ్డారు..
“పొరపాట్లు జరుగుతున్నాయి… సీఎం గుర్తించాలి”
అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు. కానీ, అమలు ప్రక్రియలో పెద్దపెద్ద పొరపాట్లు జరుగుతున్నాయి” అని మాజీ మంత్రి పేర్కొన్నారు. ముందుగా మొదటి విడత హామీలను అమలు చేయాలి. తర్వాతే రెండో విడత భూ సమీకరణపై ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలి. లేకపోతే లక్షలాది మంది ప్రజలు నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..