Durga Devi as Saraswati: సరస్వతి దేవి అవతారంలో దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు..
- సరస్వతి దేవి అవతారంలో దుర్గమ్మ..
- దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు..
- అమ్మ వారి ఆలయానికి భారీగా చేరుకుంటున్న విద్యార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Durga Devi as Saraswati: శ్రీ పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ ప్రత్యేక అలంకరణను తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులతో దుర్గగుడి ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో నిలుస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 18 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. వేలాది మంది భక్తులు ఇప్పటికే ఆలయానికి చేరుకోగా, మరింత మంది రానున్నారని అంచనా వేస్తున్నారు.
Read Also: T20 World Cup 2026: బంగ్లాదేశ్కు ముందు.. భారత్, ఆస్ట్రేలియాలో ఆడటానికి నిరాకరించిన జట్లు ఇవే
Also Read
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ వార్లో బిగ్ ట్విస్ట్.. నానిపై కేసు నమోదు
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ ముదిరిన వార్.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు
- AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
శ్రీ పంచమి సందర్భంగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది పిల్లలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అక్షరాభ్యాసాన్ని సామూహికంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రదేశాన్ని కేటాయించామని తెలిపారు. అక్షరాభ్యాసంలో పాల్గొనే పిల్లలకు పలక, పెన్ను, కంకణం, కుంకుమతో పాటు లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేస్తున్నారు. విద్య, విజ్ఞానానికి అధిష్ఠాత్రి అయిన సరస్వతి దేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల విద్యార్థులకు శుభఫలితాలు కలుగుతాయనే విశ్వాసంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పిల్లలను తీసుకువస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు అధికారులు తెలిపారు. క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా పోలీసులు, ఆలయ సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
-
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
-
Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
-
Old Smartphones: మీ ఇంట్లో ఉన్న పాత ఫోన్లకు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా?
-
Pinarayi Vijayan: రాహుల్ గాంధీ వల్ల బీజేపీకి లాభం.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!