Durga Devi as Saraswati: సరస్వతి దేవి అవతారంలో దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు..
- సరస్వతి దేవి అవతారంలో దుర్గమ్మ..
- దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు..
- అమ్మ వారి ఆలయానికి భారీగా చేరుకుంటున్న విద్యార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Durga Devi as Saraswati: శ్రీ పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ ప్రత్యేక అలంకరణను తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులతో దుర్గగుడి ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో నిలుస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 18 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. వేలాది మంది భక్తులు ఇప్పటికే ఆలయానికి చేరుకోగా, మరింత మంది రానున్నారని అంచనా వేస్తున్నారు.
Read Also: T20 World Cup 2026: బంగ్లాదేశ్కు ముందు.. భారత్, ఆస్ట్రేలియాలో ఆడటానికి నిరాకరించిన జట్లు ఇవే
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
శ్రీ పంచమి సందర్భంగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది పిల్లలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అక్షరాభ్యాసాన్ని సామూహికంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రదేశాన్ని కేటాయించామని తెలిపారు. అక్షరాభ్యాసంలో పాల్గొనే పిల్లలకు పలక, పెన్ను, కంకణం, కుంకుమతో పాటు లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేస్తున్నారు. విద్య, విజ్ఞానానికి అధిష్ఠాత్రి అయిన సరస్వతి దేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల విద్యార్థులకు శుభఫలితాలు కలుగుతాయనే విశ్వాసంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పిల్లలను తీసుకువస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు అధికారులు తెలిపారు. క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా పోలీసులు, ఆలయ సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!