Durga Devi as Saraswati: సరస్వతి దేవి అవతారంలో దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు..
- సరస్వతి దేవి అవతారంలో దుర్గమ్మ..
- దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు..
- అమ్మ వారి ఆలయానికి భారీగా చేరుకుంటున్న విద్యార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Durga Devi as Saraswati: శ్రీ పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ ప్రత్యేక అలంకరణను తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులతో దుర్గగుడి ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో నిలుస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 18 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. వేలాది మంది భక్తులు ఇప్పటికే ఆలయానికి చేరుకోగా, మరింత మంది రానున్నారని అంచనా వేస్తున్నారు.
Read Also: T20 World Cup 2026: బంగ్లాదేశ్కు ముందు.. భారత్, ఆస్ట్రేలియాలో ఆడటానికి నిరాకరించిన జట్లు ఇవే
Also Read
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
శ్రీ పంచమి సందర్భంగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది పిల్లలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అక్షరాభ్యాసాన్ని సామూహికంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రదేశాన్ని కేటాయించామని తెలిపారు. అక్షరాభ్యాసంలో పాల్గొనే పిల్లలకు పలక, పెన్ను, కంకణం, కుంకుమతో పాటు లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేస్తున్నారు. విద్య, విజ్ఞానానికి అధిష్ఠాత్రి అయిన సరస్వతి దేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల విద్యార్థులకు శుభఫలితాలు కలుగుతాయనే విశ్వాసంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పిల్లలను తీసుకువస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు అధికారులు తెలిపారు. క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా పోలీసులు, ఆలయ సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!