Vijayawada Kanaka Durga: కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం.. ఈ నవరాత్రులలో ప్రత్యేకం..
- ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..
- బాలాత్రిపురసుందరిగా దర్శనం ఇస్తున్న అమ్మవారు..
- కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం..
- 2 కోట్ల విలువైన కిరీటం నవరాత్రులలో ప్రత్యేకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Kanaka Durga: అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి.. కనకదుర్గమ్మ భక్తులకు బాలాత్రిపురసుందరిగా దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో వస్తున్నారు.. తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు.. ఈసారి ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేసిందంటున్నారు భక్తులు.. మరోవైపు..ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం అందజేశారు ముంబైకి చెందిన సౌరభ్.. అలాగే సీఎం రమేష్ అనే భక్తుడు సూర్యచంద్రులను, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తురాలు హైమవతి సూర్యకుమారి బొట్టును అందజేశారు.. మొత్రం అభరణాలు వజ్రాలు పొదిగినవే.. 2 కోట్ల విలువైన కిరీటం దసరా నవరాత్రులలో ప్రత్యేకం కానుంది.. అమ్మవారి వజ్రాభరణాల అలంకరణ వైదిక విధానంలో హోమాదులు నిర్వహించి అలంకరిస్తామని ఆలయ పండితులు శంకరశాండిల్య వెల్లడించారు..
Read Also: Bathukamma Day-2: నేడు అటుకుల బతుకమ్మ.. విశిష్టత ఇదే..
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
మరోవైపు, దుర్గగుడిలో దసరా ఉత్సవాల సేవాకమిటీని నియమించింది ఏపీ ప్రభుత్వం.. శ్రీ దుర్గా సేవాకమిటీ పేరుతో 56 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఈనెల 3వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు జరిగే “దసరా నవరాత్రులు ఉత్సవాల్లో భక్తులకు, యాత్రికులకు సేవ చేసేందుకు 56 మంది సభ్యులను నియమింవినట్లు ప్రకటించింది.. ఇక, వృద్ధులు, వికలాంగులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలలో స్టెయిర్ లిఫ్ట్ ప్రత్యేకంగా నిలుస్తోంది.. స్టెయిర్ లిఫ్ట్ వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మెట్లు ఎక్కి దిగే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!