Daggubati Purandeswari: ప్రధాని మోడీకి ధన్యవాదాలు.. కూటమితోనే అభివృద్ధి సాధ్యమని చేసి చూపిస్తున్నాం..
- ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన పురంధేశ్వరి..
- ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం..
- అభివృద్ధి చేస్తామని చెప్పి.. చేసి చూపిస్తున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెబుతూ.. అమరావతి రైల్వే లైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటు పురంధేశ్వరి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి, చేసి చూపిస్తున్నాం అన్నారు.. 2,245 కోట్ల రూపాయలతో ఎర్రుబాలెం నుండి నంబూరు వరకు రైల్వే లైన్ రావడం సంతోషం అన్నారు.. 55 కిలో మీటర్ల ఈ రైల్వే లైన్ ఉంటుంది.. ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని అని చెప్పి, ఆ మాటకే కట్టుబడి వున్నాం అని మరోసారి స్పష్టం చేశారు.. కనకదుర్గ ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్లకు కేంద్రం సహకారం అందించింది.. పోలవరానికి కూడా కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.
Read Also: US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేలో మరో ట్విస్ట్..
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
ఇక, వికసిత్ భారత్ తో పాటు వికసిత్ ఏపీ కూడా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ ఎల్లప్పుడూ చెబుతారని.. సాధ్యమైనంత త్వరగా అమరావతి రైల్వే లైన్ పూర్తి చేస్తాం అన్నారు పురంధేశ్వరి.. కాగా, అమరావతికి 57 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు.. గురువారం రోజు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన విషయం విదితమే.. రూ.2,245 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు గ్నీన్ సిగ్నల్ వచ్చిందని.. హైదరాబాద్, కోల్కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!