BV Raghavulu: ఇరాన్తో భారత్కు ఆర్ధిక సంబంధాలు..! ఇజ్రాయిల్కి మద్దతు ఇవ్వడం దేనికి..?
- ఇరాన్తో మన దేశానికి ఆర్ధిక సంబంధాలు ఉన్నాయి..
- ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ఇస్తోంది.. ఇదీ దారుణం..
- పాక్ విషయంలో కేంద్రం ఏదో దాస్తుందన్న బీవీ రాఘవులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BV Raghavulu: ఇరాన్తో మన దేశానికి ఆర్ధిక సంబంధాలు ఉన్నాయి.. కానీ, ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ఇస్తోంది.. ఇదీ దారుణం అన్నారు సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన వివిధ అంశాలపై స్పందించారు.. పెహల్గామ్ లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలకు వివరించడానికి వారం రోజులు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలపై దాడిచేసి ధ్వసం చేసింది.. మరి, పాకిస్ధాన్, ఇండియా మధ్య యుద్ధం ఆపింది నేనే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు.. దీంతో, కేంద్రం ఏదో దాస్తుంది అనే అనుమానం కలుగుతుందన్నారు.. ఇజ్రాయిల్, ఇరాక్ మధ్య యుద్ధాన్ని కూడా ఆపుతామంటూ ట్రంప్ ప్రకటించారని గుర్తుచేశారు..
Read Also: Vijayawada: భర్త కొడుతున్నాడని 112 కు ఫోన్ చేసిన మహిళ… చివరికీ..
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
ఇక, గతంతో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని గుర్తు చేసుకోవాలి.. నాటి పరిస్థితికంటే మరింత దారుణమైన పరిస్థితులు ఇప్పుడు వచ్చాయని విమర్శించారు బీవీ రాఘవులు.. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్న ఆయన.. ఇరాన్.. ఇజ్రాయిల్పై దాడి చేసింది.. ఈ యుద్దం తీవ్రమైతే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు దెబ్బతగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. యుద్ధం నుండి వెనక్కి తగ్గాలని ఇజ్రాయిల్ పై ఒత్తిడి తీసుకుని రావాలని సూచించారు.. ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ఇస్తోంది.. ఇదీ దారుణం అన్నారు.. ఇరాన్ తో మన దేశానికి ఆర్ధిక సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేశారు.. ఇజ్రాయిల్ దాడిని భారత్ ఖండించాలి.. ఇప్పటికే 10శాతం క్రూడాయిల్ ధరలు పెరిగాయి.. భారత్ ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. అయితే, అమెరికా చెప్పిన విధంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. పార్లమెంట్ సమావేశాలు వేసి ఈ అంశాలపై చర్చించాలి.. పార్లమెంట్ ముందు ప్రకటన చేయడం అంటే అది ప్రభుత్వ ప్రకటనగా భావిస్తాం.. పార్లమెంట్ మీద ఇంకా నమ్మకం పోలేదన్నారు సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!