BV Raghavulu: ఇరాన్తో భారత్కు ఆర్ధిక సంబంధాలు..! ఇజ్రాయిల్కి మద్దతు ఇవ్వడం దేనికి..?
- ఇరాన్తో మన దేశానికి ఆర్ధిక సంబంధాలు ఉన్నాయి..
- ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ఇస్తోంది.. ఇదీ దారుణం..
- పాక్ విషయంలో కేంద్రం ఏదో దాస్తుందన్న బీవీ రాఘవులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BV Raghavulu: ఇరాన్తో మన దేశానికి ఆర్ధిక సంబంధాలు ఉన్నాయి.. కానీ, ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ఇస్తోంది.. ఇదీ దారుణం అన్నారు సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన వివిధ అంశాలపై స్పందించారు.. పెహల్గామ్ లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలకు వివరించడానికి వారం రోజులు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలపై దాడిచేసి ధ్వసం చేసింది.. మరి, పాకిస్ధాన్, ఇండియా మధ్య యుద్ధం ఆపింది నేనే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు.. దీంతో, కేంద్రం ఏదో దాస్తుంది అనే అనుమానం కలుగుతుందన్నారు.. ఇజ్రాయిల్, ఇరాక్ మధ్య యుద్ధాన్ని కూడా ఆపుతామంటూ ట్రంప్ ప్రకటించారని గుర్తుచేశారు..
Read Also: Vijayawada: భర్త కొడుతున్నాడని 112 కు ఫోన్ చేసిన మహిళ… చివరికీ..
Also Read
- AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
ఇక, గతంతో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని గుర్తు చేసుకోవాలి.. నాటి పరిస్థితికంటే మరింత దారుణమైన పరిస్థితులు ఇప్పుడు వచ్చాయని విమర్శించారు బీవీ రాఘవులు.. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్న ఆయన.. ఇరాన్.. ఇజ్రాయిల్పై దాడి చేసింది.. ఈ యుద్దం తీవ్రమైతే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు దెబ్బతగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. యుద్ధం నుండి వెనక్కి తగ్గాలని ఇజ్రాయిల్ పై ఒత్తిడి తీసుకుని రావాలని సూచించారు.. ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ఇస్తోంది.. ఇదీ దారుణం అన్నారు.. ఇరాన్ తో మన దేశానికి ఆర్ధిక సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేశారు.. ఇజ్రాయిల్ దాడిని భారత్ ఖండించాలి.. ఇప్పటికే 10శాతం క్రూడాయిల్ ధరలు పెరిగాయి.. భారత్ ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. అయితే, అమెరికా చెప్పిన విధంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. పార్లమెంట్ సమావేశాలు వేసి ఈ అంశాలపై చర్చించాలి.. పార్లమెంట్ ముందు ప్రకటన చేయడం అంటే అది ప్రభుత్వ ప్రకటనగా భావిస్తాం.. పార్లమెంట్ మీద ఇంకా నమ్మకం పోలేదన్నారు సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు..
తాజావార్తలు
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!