Minister Nara Lokesh: మా హయాంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం..
- ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం..
- విజయవాడలో సీఐఐ సమావేశంలో మంత్రి నారా లోకేష్..
- 70 మంది సీఈవోలు వచ్చిన ఈ సమావేశంలో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను..
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు మంత్రి నారా లోకేష్.. విజయవాడలో సీఐఐ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడారు.. 70 మంది సీఈవోలు వచ్చిన ఈ సమావేశంలో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.. ఏపీలో ఉద్యోగ కల్పన చాలా అవసరం… ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది మా లక్ష్యంగా పేర్కొన్నారు.. వ్యవసాయం, MSME రంగాలకు ఏపీ ఒక కేంద్రంగా ఉంది.. చంద్రబాబు సీఎం అయిన ప్రతీసారీ కొత్తగా ముందుకెళుతున్నారు.. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఇప్పుడు చంద్రబాబు మాట స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా అభివర్ణించారు.
Read Also: MP Sudha Murty: క్రియేటివ్ గా ఆలోచించండి.. సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలి..
Also Read
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
- Vijayawada: న్యూడ్ ఫొటోలతో మహిళను బ్లాక్మెయిల్.. రూ.2 కోట్ల డిమాండ్.!
ఏపీలో మానవ వనరులు కంపెనీల అవసరాలకు తగినట్టుగా సిద్ధంగా ఉన్నాయి అన్నారు మంత్రి నారా లోకేష్.. ఏపీలో యువత చాలామంది ఉన్నారు.. కేజీ టూ పీజీ యువతకు ఉపాధి ఇచ్చే నాలెడ్జ్ పెంచడం మా ధ్యేయం.. రాబోయే ఆరు నెలల్లో డేటా సెంటర్లు వంటివి చాలా వస్తాయి… ఐటీ, డేటా సెంటర్లు, ఏఐలతో విశాఖ పూర్తిస్ధాయిలో అభివృద్ది వైపు వెళ్తుందన్నారు.. నీరు, ఎన్సెంటివ్స్ లాంటి వాటిలో గత ఐదేళ్లలో ఇబ్బందులు వచ్చాయి.. యువ ఐఏఎస్ అధికారికి ప్రత్యేకంగా పారిశ్రామికాభివృద్ధి విషయంలో బాధ్యతలు ఇచ్చాం అన్నారు.. ఇక, సీఈవోల ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలు ఇస్తూ.. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, వ్యవసాయంలోకి డిజిటల్ విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నాం.. సాంకేతికత ద్వారా వ్యవసాయానికి ఖర్చు తగ్గిస్తాం.. ఏపీలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ను తీసుకొస్తాం.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వానికి సమావేశాలకు ఒకే కామన్ పాయింట్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్నారు.. కేరళ మాదిరిగా రెండు నెలలకు ఒకసారి పరిశ్రమలతో సమావేశంపై మిగిలిన మంత్రులతో మాట్లాడి త్వరలో నిర్ణయిస్తాం అన్నారు.. పరిశ్రమల ఏర్పాటుకు ఒక ప్రత్యేక ఎకో సిస్టం ఉండాలన్నారు.. గత ప్రభుత్వ హయాంలో పీపీఏల రద్దు ఏపీకే కాదు దేశానికే ఇబ్బంది కలిగించింది అన్నారు..
Read Also: MP Sudha Murty: క్రియేటివ్ గా ఆలోచించండి.. సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలి..
ఏపీ మహిళలు పారిశ్రామిక వేత్తలు కావాలి అని పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్.. అగ్రి బయోటెక్ క్లష్టర్ కు మా ప్రాధాన్యత ఉంటుంది.. ప్రతీ మహిళకు ఇంటి నుంచే ప్రోత్సాహం మొదలవ్వాలన్నారు.. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మా ప్రోత్సాహం ఉంటుందని స్పష్టం చేశారు.. అయితే, ఏపీలో అగ్రి బయోటెక్ క్లష్టర్ ఏర్పాటు పై ఆలోచించాలని సూచించిన భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా లెల్లా సూచించారు..
తాజావార్తలు
-
Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
-
Ragi Papad Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. “రాగి పాపడాలు” ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
-
Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
-
Coriander Rice Recipe: ఈజీ అండ్ క్విక్ రెసిపీ.. సింపుల్ ఇంగ్రిడియెంట్స్తో స్పెషల్ ‘కొత్తిమీర రైస్’ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!