Minister Nara Lokesh: మా హయాంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం..
- ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం..
- విజయవాడలో సీఐఐ సమావేశంలో మంత్రి నారా లోకేష్..
- 70 మంది సీఈవోలు వచ్చిన ఈ సమావేశంలో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు మంత్రి నారా లోకేష్.. విజయవాడలో సీఐఐ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడారు.. 70 మంది సీఈవోలు వచ్చిన ఈ సమావేశంలో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.. ఏపీలో ఉద్యోగ కల్పన చాలా అవసరం… ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది మా లక్ష్యంగా పేర్కొన్నారు.. వ్యవసాయం, MSME రంగాలకు ఏపీ ఒక కేంద్రంగా ఉంది.. చంద్రబాబు సీఎం అయిన ప్రతీసారీ కొత్తగా ముందుకెళుతున్నారు.. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఇప్పుడు చంద్రబాబు మాట స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా అభివర్ణించారు.
Read Also: MP Sudha Murty: క్రియేటివ్ గా ఆలోచించండి.. సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలి..
Also Read
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
- Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
ఏపీలో మానవ వనరులు కంపెనీల అవసరాలకు తగినట్టుగా సిద్ధంగా ఉన్నాయి అన్నారు మంత్రి నారా లోకేష్.. ఏపీలో యువత చాలామంది ఉన్నారు.. కేజీ టూ పీజీ యువతకు ఉపాధి ఇచ్చే నాలెడ్జ్ పెంచడం మా ధ్యేయం.. రాబోయే ఆరు నెలల్లో డేటా సెంటర్లు వంటివి చాలా వస్తాయి… ఐటీ, డేటా సెంటర్లు, ఏఐలతో విశాఖ పూర్తిస్ధాయిలో అభివృద్ది వైపు వెళ్తుందన్నారు.. నీరు, ఎన్సెంటివ్స్ లాంటి వాటిలో గత ఐదేళ్లలో ఇబ్బందులు వచ్చాయి.. యువ ఐఏఎస్ అధికారికి ప్రత్యేకంగా పారిశ్రామికాభివృద్ధి విషయంలో బాధ్యతలు ఇచ్చాం అన్నారు.. ఇక, సీఈవోల ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలు ఇస్తూ.. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, వ్యవసాయంలోకి డిజిటల్ విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నాం.. సాంకేతికత ద్వారా వ్యవసాయానికి ఖర్చు తగ్గిస్తాం.. ఏపీలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ను తీసుకొస్తాం.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వానికి సమావేశాలకు ఒకే కామన్ పాయింట్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్నారు.. కేరళ మాదిరిగా రెండు నెలలకు ఒకసారి పరిశ్రమలతో సమావేశంపై మిగిలిన మంత్రులతో మాట్లాడి త్వరలో నిర్ణయిస్తాం అన్నారు.. పరిశ్రమల ఏర్పాటుకు ఒక ప్రత్యేక ఎకో సిస్టం ఉండాలన్నారు.. గత ప్రభుత్వ హయాంలో పీపీఏల రద్దు ఏపీకే కాదు దేశానికే ఇబ్బంది కలిగించింది అన్నారు..
Read Also: MP Sudha Murty: క్రియేటివ్ గా ఆలోచించండి.. సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలి..
ఏపీ మహిళలు పారిశ్రామిక వేత్తలు కావాలి అని పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్.. అగ్రి బయోటెక్ క్లష్టర్ కు మా ప్రాధాన్యత ఉంటుంది.. ప్రతీ మహిళకు ఇంటి నుంచే ప్రోత్సాహం మొదలవ్వాలన్నారు.. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మా ప్రోత్సాహం ఉంటుందని స్పష్టం చేశారు.. అయితే, ఏపీలో అగ్రి బయోటెక్ క్లష్టర్ ఏర్పాటు పై ఆలోచించాలని సూచించిన భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా లెల్లా సూచించారు..
తాజావార్తలు
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
-
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
-
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!