CM Chandrababu: ఆహార పంపిణీ సక్రమంగా సాగుతోంది.. డిమాండ్ చేసి వస్తువులు తీసుకోండి..
- ఆహార పంపిణీ సక్రమంగా సాగుతోందన్న సీఎం చంద్రబాబు.. ఫుడ్ కొద్దిగా వృధా అయినా ఫర్వాలేదని చెప్పి ఉదారంగా పంపిస్తున్నాం..
- మంచినీళ్లు.. పాలు.. బిస్కెట్లు.. కొవ్వొత్తులు.. అగ్గిపెట్టెలు కూడా పంపిస్తున్నాం..
- బియ్యం.. ఉల్లిపాయలు.. చక్కెర.. ఆయిల్ కూడా అందిస్తున్నాం..
- ఎక్కడైనా బియ్యం.. ఇతర వస్తువులు దొరకకుండా చేస్తే చొక్కా పట్టుకుని అడగండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఇవాళ ఆహార పంపిణీ సక్రమంగా జరిగింది.. ఫుడ్ కొద్దిగా వృధా అయినా ఫర్వాలేదని చెప్పి ఉదారంగా పంపిస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంచినీళ్లు.. పాలు, బిస్కెట్లు.. కొవ్వొత్తులు.. అగ్గిపెట్టెలు కూడా పంపిస్తున్నాం. బియ్యం.. ఉల్లిపాయలు, చక్కెర, ఆయిల్ కూడా అందిస్తున్నాం.. ఎక్కడైనా బియ్యం, ఇతర వస్తువులు దొరకకుండా చేస్తే చొక్కా పట్టుకుని అడగండి అని సూచించారు. డ్రై ఫుడ్ కూడా పంపిస్తున్నాం. డిమాండ్ చేసి వస్తువులు తీసుకోండి అంటూ వరద బాధితులకు సూచించారు..
Read Also: Weight Loss Tips: త్వరగా బరువు తగ్గాలా? అయితే ఈ టిప్స్ పాటించండి
Also Read
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
- Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
ఇక, బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. కేంద్రానికి వరదలపై ప్రాథమిక నివేదిక పంపించాం.. రూ. 6880 కోట్ల నష్టం వచ్చింది.. ఇదే నివేదిక ఇచ్చాం అన్నారు.. బుడమేరు గండ్లు మూడూ పూడ్చివేశాం. గండ్లు పూడ్చిన తర్వాత నమ్మకం వచ్చింది. వినాయకచవితి పండగ రోజు గండ్లు పూడ్చాం. ఆర్మీ కూడా ప్రశంసించిందన్నారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, లోకేష్ దృష్టి పెట్టి బుడమేరు గండ్లు పూడ్చారని అభినందించారు. గత పాలకులు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.. గత ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. గేట్ల నిర్వహణకు పైసా ఇవ్వలేదు.. బుడమేరుకు నిధులివ్వలేదు. అన్ని పాపాలు కలిసి ఇప్పుడు శాపాలుగా మారాయన్నారు. వర్షం ఎక్కువగా పడుతోంది.. కృష్ణాలో మళ్లీ నీళ్లు వస్తున్నాయి. బుడమేరు క్లోజ్ చేసినా ఇంకా ఒక టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి.. వర్షం వల్ల మళ్లీ నీళ్లు పెరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!