CM Chandrababu: ఆహార పంపిణీ సక్రమంగా సాగుతోంది.. డిమాండ్ చేసి వస్తువులు తీసుకోండి..
- ఆహార పంపిణీ సక్రమంగా సాగుతోందన్న సీఎం చంద్రబాబు.. ఫుడ్ కొద్దిగా వృధా అయినా ఫర్వాలేదని చెప్పి ఉదారంగా పంపిస్తున్నాం..
- మంచినీళ్లు.. పాలు.. బిస్కెట్లు.. కొవ్వొత్తులు.. అగ్గిపెట్టెలు కూడా పంపిస్తున్నాం..
- బియ్యం.. ఉల్లిపాయలు.. చక్కెర.. ఆయిల్ కూడా అందిస్తున్నాం..
- ఎక్కడైనా బియ్యం.. ఇతర వస్తువులు దొరకకుండా చేస్తే చొక్కా పట్టుకుని అడగండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఇవాళ ఆహార పంపిణీ సక్రమంగా జరిగింది.. ఫుడ్ కొద్దిగా వృధా అయినా ఫర్వాలేదని చెప్పి ఉదారంగా పంపిస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంచినీళ్లు.. పాలు, బిస్కెట్లు.. కొవ్వొత్తులు.. అగ్గిపెట్టెలు కూడా పంపిస్తున్నాం. బియ్యం.. ఉల్లిపాయలు, చక్కెర, ఆయిల్ కూడా అందిస్తున్నాం.. ఎక్కడైనా బియ్యం, ఇతర వస్తువులు దొరకకుండా చేస్తే చొక్కా పట్టుకుని అడగండి అని సూచించారు. డ్రై ఫుడ్ కూడా పంపిస్తున్నాం. డిమాండ్ చేసి వస్తువులు తీసుకోండి అంటూ వరద బాధితులకు సూచించారు..
Read Also: Weight Loss Tips: త్వరగా బరువు తగ్గాలా? అయితే ఈ టిప్స్ పాటించండి
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
ఇక, బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. కేంద్రానికి వరదలపై ప్రాథమిక నివేదిక పంపించాం.. రూ. 6880 కోట్ల నష్టం వచ్చింది.. ఇదే నివేదిక ఇచ్చాం అన్నారు.. బుడమేరు గండ్లు మూడూ పూడ్చివేశాం. గండ్లు పూడ్చిన తర్వాత నమ్మకం వచ్చింది. వినాయకచవితి పండగ రోజు గండ్లు పూడ్చాం. ఆర్మీ కూడా ప్రశంసించిందన్నారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, లోకేష్ దృష్టి పెట్టి బుడమేరు గండ్లు పూడ్చారని అభినందించారు. గత పాలకులు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.. గత ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. గేట్ల నిర్వహణకు పైసా ఇవ్వలేదు.. బుడమేరుకు నిధులివ్వలేదు. అన్ని పాపాలు కలిసి ఇప్పుడు శాపాలుగా మారాయన్నారు. వర్షం ఎక్కువగా పడుతోంది.. కృష్ణాలో మళ్లీ నీళ్లు వస్తున్నాయి. బుడమేరు క్లోజ్ చేసినా ఇంకా ఒక టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి.. వర్షం వల్ల మళ్లీ నీళ్లు పెరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..