Chandrababu: మేం ఎవరి జోలికి రాము.. మా జోలికి వస్తే తరిమి కొడుతాం.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
- మేం ఎవరి జోలికి రాము.. మా జోలికి వస్తే తరిమి కొడుతాం..
- ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్..
- ఉగ్రవాదంపై పోరాడే ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీయే..
Chandrababu: మేం ఎవరి జోలికి రాము.. మా జోలికి వస్తే తరిమి కొడుతామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉగ్రవాదంపై పోరాడే ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీయే అన్నారు.. విజయవాడలో నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్నారు పవన్.. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీతో త్రివిధ దళాలకు మద్దతు తెలిపింది కూటమి ప్రభుత్వం.. జాతీయ జెండాలు చేతబట్టి.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, పలువురు ఏపీ మంత్రులు, కూటమి నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ ర్యాలికి నాతో వచ్చారు.. 16, 17, 18 తేదీల్లో తిరంగా యాత్రకి ప్రజలే శ్రీకారం చుట్టారు.. ఇది ప్రజా ఉద్యమం.. ఉగ్రవాదంపై పోరాడిన సైనికులకు సెల్యూట్ అన్నారు..
Read Also: AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి అరెస్ట్..
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
జాతీయ జెండా చూడగానే అత్యంత ఉత్సాహం.. జాతీయ జెండా రూపొందించిన పింగళి వెంకయ్య కృష్ణాజిల్లాకి చెందిన వారే అని గుర్తుచేశారు చంద్రబాబు.. గుర్తింపు కలిగిన ఏకైక జెండా భారతీయ జెండా.. పెహల్గామ్ అనగానే మనం ఖబడ్దార్ జాగ్రత్త అని హెచ్చరిస్తాం.. ప్రధాని మోడీ ఆడబిడ్డల నుదుట తిలకం తీసేసిన ఉగ్రవాది ఉండకూడదని ఆపరేషన్ సిందూర్ చేపట్టారు.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది ఉగ్రవాదం.. ఉగ్రవాదంపై పోరాడే ఏకైక నాయకుడు ప్రధాని మోడీ అన్నారు.. జాతీయ జెండా కట్టుకుని మరణించిన అమరజీవి మురళీ నాయక్.. మురళీ నాయక్ అమర్ రహే.. అంటూ నినాదాలు చేశారు.. బోర్డర్లో మన సైనికులు పోరాడుతున్నారు.. మనం మద్దతిస్తున్నాం అన్నారు.. ప్రధాని మోడీ సంకల్పం ప్రపంచంలో ఉగ్రవాదులు ఎక్కడ దక్కున్నా అంతమొందించడం అని స్పష్టం చేశారు.. ప్రతీ ఒక్కరూ అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవ్వాలి.. సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకునే నాయకుడు నరేంద్ర మోడీయే అన్నారు.. 2045 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా భారతదేశం అవుతుంది.. భారతదేశం నంబర్ 1 అవ్వాలంటే.. అందరం కలిసి పని చేయాలి.. జాతి పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.. ఆపరేషన్ సిందూర్ లాంటి కార్యక్రమాలు చాలా అవసరం.. ప్రపంచ ఉగ్రవాదులు అందరూ ఆపరేషన్ సిందూర్ను గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
NTRNEEL : ఎన్టీఆర్ – ప్రశాంత్ సినిమా డైలాగ్ రైటర్ గా దేవాకట్టా
-
Vivek Agnihotri: మమతా బెనర్జీ ఓటమిపై వివేక్ అగ్నిహోత్రి సంచలన పోస్ట్..
-
IPL Ticket Scam Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల స్కామ్ బట్టబయలు.. అభిమానులకు పోలీసులు హెచ్చరికలు!
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ త్వరలో భారత్ లో విడుదల.. 80W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ
-
Rajnikanth : జైలర్ హిట్టయినా..జైలర్2ను తెలుగులో ఎందుకు కొనడం లేదు?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!