Vijayasai Reddy: రాష్ట్ర ప్రయోజనాలే వైసీపీకి ముఖ్యం.. మోడీ సభను రాజకీయం చేయొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy On PM Narendra Modi Vizag Tour: తమ వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే తాము కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని ఎంపీ విజయసాయి రెడ్డీ స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను అభివృద్ధి చేయాలన్నదే వైసీపీ లక్ష్యమని, ఆ ఆలోచనతోనే తాము రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చామని తెలిపారు. విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ కోసం ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈనెల 11వ తేదీన ప్రధాని విశాఖకు రానున్నారని, 12న బహిరంగ సభ జగనుందని వెల్లడించారు. ఈ సభను విజయవంతం చేసేందుకు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీలో జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు సభ్యులుగా ఉంటారని అన్నారు.
ఏయూలోని రెండు ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో 29 ఎకరాల్లో ప్రధాని మోడీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా విజయసాయి రెడ్డి క్లారిటీ ఇచ్చారు. క్రీడా అవసరాలకు తగ్గట్టు మైదానాన్ని సిద్ధం చేస్తున్నామని.. ప్రధాని హెలికాప్టర్ కోసం ఏయూ ఇంకుబేషన్ సెంటర్ వద్ద ఏర్పాట్లు చేపబడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ బహిరంగ సభకు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రధాని ఏ రాష్ట్రానికి వస్తారో, అయా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా సహకరించాల్సి ఉంటుందని.. తామూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ విశాఖ పర్యటనలో భాగంగా మోడీ రూ. 12 వేల కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభిస్తారన్నారు. ఇందులో రాజకీయ కోణాలు చూడకూడదని, అనవసరమైన రాద్ధాంతాలకు తెరలేపొద్దని ప్రతిపక్షాల్ని కోరారు.
Also Read
- AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటన..
- Botsa Satyanarayana: ‘ప్రజా సమస్యలను వదిలేసి ప్రభుత్వం పబ్లిసిటీ డ్రామాలు ఆడుతోంది’..
- AP Rain Alert: ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
- El Niño Impact: కొబ్బరిబొండాల పైనా 'ఎల్నినో' ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
విశాఖ నుంచి పరిపాలన సాగుతుందని.. రాజధాని అంశం అమలవ్వడం ఖాయమని విజయసాయి రెడ్డి చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా.. విశాఖ రాజధాని కావడాన్ని అడ్డుకోలేరన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో వైసీపీ కట్టుబడి ఉందని, స్టీల్ ప్లాంట్ కార్మికుల పక్షాన తమ పార్టీ ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. తమ వైసీపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!