Vasantha Krishna Prasad: నా తండ్రి అందుకే కేశినేని నానిని కలిశారు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasantha Krishna Prasad: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తన తండ్రి టీడీపీ ఎంపీ కేశినేని నానిని కలవడంపైనా క్లారిటీ ఇచ్చారు. కేశినేని నాని కుమార్తె పెళ్లికి తన తండ్రి వసంత నాగేశ్వరరావు వెళ్లలేకపోయారని.. పెళ్లికి వెళ్లలేదు కాబట్టే కర్టసీగా కేశినేని నానిని పలకరించడానికి వెళ్లారని తెలిపారు. కేశినేని నానితో తన తండ్రి భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. మరోవైపు తన కామెంట్ల వల్ల పార్టీ అధిష్టానం ఇబ్బంది పడుతుందని భావించడం లేదన్నారు.
యదార్ధ వాది లోక విరోధి తాను వాస్తవాలు మాట్లాడుతోన్న వాటిని సంచలనాలు అంటున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక చేయాల్సినవి చేయలేకపోయాననే అసంతృప్తి ఉందని.. పార్టీలో కొందరు సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తారని.. తనకు అది ఇష్టం లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తరహా రాజకీయాలు చేయలేమని.. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల కాలం నడుస్తోందన్నారు. పొరంబోకులు పక్కన లేకుంటే రాజకీయాలు చేయలేమని.. ఇది వాస్తవమని.. తాను అదే చెప్పానని పేర్కొన్నారు. ఉయ్యూరు శ్రీనివాస్ విషయంలో కూడా తన అభిప్రాయం చెప్పానని.. ఉయ్యూరు శ్రీనివాస్తో తనకు పరిచయం ఉందన్నారు. ఎన్ఆర్ఐలు వల్ల లాభమే తప్ప నష్టం లేదని తన అభిప్రాయం అన్నారు.
Also Read
- MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
- CM Chandrababu Convoy: ప్రధాని మోడీ పిలుపు.. కాన్వాయ్ తగ్గించుకున్న సీఎం చంద్రబాబు!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
Read Also: Girl Cheated: ప్రేమలో మోసపోయా.. న్యాయం చేయాలని యువకుడు సూసైడ్ నోట్
అటు మంగళవారం నాడు మైలవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పనితీరుపై ఎలాంటి అసంతృప్తి ఉన్నా.. సమావేశానికి వచ్చిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, వెలంపల్లికి చెప్పాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా వైసీపీని గెలిపించేందుకు పని చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ నేతలను.. టీడీపీ నేతలను తానేమీ ఉత్త పుణ్యాన కామెంట్లు చేయనని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. పక్క పార్టీ నేతలపై అకారణంగా కేసులు పెట్టడానికి తాను వ్యతిరేకం అని.. అయితే తాను చేసే కొన్ని కామెంట్లను ఎడిట్ చేసి సంచలనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలోనూ చిన్న చితకా గొడవలు సహజమన్నారు. అయితే ప్రతి చోటా చిన్న చితకా ఇబ్బందులు ఉంటాయని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వసంత కృష్ణప్రసాద్ పోటీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తాజావార్తలు
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!