Vangaveeti Radha: రంగా అంటే పోరాటానికి దిక్సూచి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు వంగవీటి రాధా. దీంతో శ్రీనగర్ కాలనీకి పెద్దఎత్తున చేరుకున్నారు వంగవీటి రంగా, రాధా అభిమానులు. భారీ ర్యాలీతో, బాణా సంచాతో రాధాకు స్వాగతం పలికారు అభిమానులు. కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు. నా తండ్రిని కులమతాలకతీతంగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. శ్రీనగర్ కాలనీలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు.రాష్ట్రం నలుమూలలా రంగా గారి పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు. రంగా అంటే పోరాటానికి దిక్సూచి, పేదల పాలిట పెన్నిధి అన్నారు వంగవీటి రాధాకృష్ణ.
రంగా కొడుకుగా ఎవ్వర్ని అభ్యర్ధించను.. జిల్లాకు రంగా పేరు పెడితే ఆనందిస్తాను. రంగా ఒక్క జిల్లాకే పరిమితం కాదు.. రాష్ట్రం మొత్తం ఆరాధిస్తుందన్నారు. రంగా చరిత్ర గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పనక్కర్లేదు. రంగా అభిమానులంతా ఏకమైతే ప్రభుత్వాలే కూలిపోవడం ఖాయం. రంగా శిష్యులు, అభిమానులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వారు కూడా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టేలా కృషి చేయాలని కోరారు. ఏ పదవి, హోదా ఇవ్వని గౌరవం నాకు రంగా అబ్బాయిగా దక్కింది. పదవులు ఐదేళ్లకు మారిపోవచ్చు. రంగా కొడుకుగా ప్రజలు చూపించే అభిమానం అనంతం అని ఉద్వేగానికి గురయ్యారు రాధాకృష్ణ. ఈ జన్మకు రంగా కొడుకనే అదరణే నాకు సంతృప్తి అన్నారు వంగవీటి రాధా.
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
జనసేన నేత పోతిన మహేష్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా పేరు చెప్పుకోకుండా రాజకీయాలు చేయలేరు.ఏ పార్టీ అయినా, ఏ సామాజిక వర్గమైనా రంగా పేరు చెప్పుకునే పరిస్థితి.వంగవీటి మోహనరంగా కుల, మతాలకతీతంగా పేదల కోసం అండగా నిలిచారు.ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నాయకుడు వంగవీటి మోహనరంగా.రంగా తనయుడిగా రాధాకృష్ణ తండ్రి ఆశయాల కోసం పని చేస్తున్నారు.గుండె నిండా అభిమానం నింపుకున్న వారంతా రాధా అడుగు జాడల్లో నిలవాలి.రాధాకృష్ణ ఎమ్మెల్యే కావడమే కాక, రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని ప్రజలు కోరుకుంటున్నారు. జిల్లాల పునర్విభజన నేపధ్యంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలి.
రాధా రంగ మిత్ర మండలి అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా చనిపోయిన తర్వాత కోట్ల మంది అభిమానులు కన్నీళ్లు పెట్టారన్నారు. రంగా ఒక శక్తి.. అందుకే ఊరు వాడా స్వచ్ఛందంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రంగాను చూడని నేటి తరం కూడా ఆరాధించడం గొప్ప విషయం. ఈ జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని లక్షలాది మంది కోరుతున్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నాం అన్నారు.
తాజావార్తలు
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!