Vallabhaneni Vamsi: రోడ్డు మీదకు వస్తే నేనేంటో చూపిస్తా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో గన్నవరం రచ్చ కొనసాగుతోంది. రెండు రోజుల నుంచి వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు కత్తులు నూరుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. వైసీపీలో వంశీ వర్సెస్ దుట్టా, వంశీ వర్సెస్ యార్లగడ్డ వర్గాలుగా చీలిక కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిప్పులు చెరిగారు.
దుట్టా రామచంద్రరావు పెద్ద మనిషి అని గౌరవించానని.. కానీ ఆయన హద్దు మీరి మాట్లాడుతున్నాడని వల్లభనేని వంశీ ఆరోపించారు. నాలుక అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. శివ భరత్ రెడ్డి ఎక్కువగా మాట్లాడితే డొక్క పగలకొడతానని.. తాను పాలేరు తనం చేసింది ఆయన చూశాడా అని ప్రశ్నించారు. మల్లవల్లి లాండ్స్లో ఎవరు స్కాం చేశారో అందరికీ తెలుసన్నారు. షుగర్ ఫ్యాక్టరీ రైతులను మోసం చేస్తే చెప్పులతో కొట్టడానికి వచ్చిన విషయం మర్చిపోవద్దని హితవుపలికారు. వాళ్ళకంటే తాను ఎంత బలవంతుడినో నియోజకవర్గ ప్రజలకు తెలుసని.. రోడ్డు మీదికి వస్తే వంశీ అంటే ఏంటో చూపిస్తానని సవాల్ విసిరారు. గన్నవరంలో పుచ్చలపల్లి సుందరయ్య తరువాత వరుసగా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేను తానేనని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం గడప గడపకు తిరుగుతున్నానని పేర్కొన్నారు. ఉంగుటూరు మండలంలో సరిహద్దులు తెలియని వాళ్ళను జెడ్పీటీసీగా ఏకగ్రీవం చేశామని వల్లభనేని వంశీ అన్నారు.
Also Read
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
తాజావార్తలు
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!