ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన సీపీఎం మహాసభల్లో కొత్త కార్యదర్శిని ఎన్నుకున్నారు.. ఇప్పటి వరకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పి. మధు కొనసాగగా.. ఇవాళ కొత్త కార్యదర్శిగా వి. శ్రీనివాసరావును ఎన్నుకున్నారు మహాసభలకు హాజరైన ప్రతినిధులు.. ఇకపై మధు స్థానంలో కార్యదర్శిగా శ్రీనివాసరావు కొనసాగనున్నారు.. ఇక, కార్యదర్శి పదవి కోసం శ్రీనివాసరావు, ఎంఏ గఫూర్ పేర్లను పరిశీలించిన కార్యదర్శి వర్గం.. చివరకు శ్రీనివాసరావుకు పగ్గాలు అప్పజెప్పింది.. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా 13 మందిని ఎంపిక చేశారు.. రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఇద్దరికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు… 35 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు.. ఇప్పటి వరకు రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ వచ్చిన మాజీ ఎంపీ, సీనియర్ నేత పి. మధుతో పాటు.. మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య సహా ఐదుగురు నేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. కాగా, రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన వి. శ్రీనివాసరావు.. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా సేవలు అందిస్తున్నారు.