Undavalli Arun Kumar: నేను బతికి ఉండగా పోలవరం పూర్తవడం అసాధ్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ పొలిటీషన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు విషయాన్ని మరోసారి ప్రస్తావించారు.. నేను బతికి ఉండగా పోలవరం పూర్తవడం అసాధ్యం అని హాట్ కామెంట్లు చేశారు ఉండల్లి… ఇక, గతంలో నేను చెప్పినదే ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు.. అది నిజం అన్నారు.. అందుకు.. మంత్రి అంబటికి అభినందలు తెలిపారు ఉండల్లి అరుణ్ కుమార్.. గతంలో చంద్రబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించారు.
Read Also: AP SSC Supplementary Results: టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. 64.23 శాతం ఉత్తీర్ణత
Also Read
అసలు డాయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం ఏవరు ? అని ప్రశ్నించారు ఉండవల్లి… దానికి ఎవరిని బాధ్యులను చేస్తారు..? ఏవరిపై చర్యలు తీసుకుంటున్నారు ? అని నిలదీసిన ఆయన… పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు… ఇక, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని కోరిన ఆయన.. నిర్వాసితులను సమాధి చేసే ఆలోచన ఎందుకు ? చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, గతంలోనూ పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్.. పోలవరం డ్యామ్ అనేది ఉండదన్న ఆయన.. భారీ ఎత్తున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని నేను మానసికంగా సిద్ధపడ్డానని పేర్కొన్న ఆయన.. ఏదో చిన్నపాటి రిజర్వాయర్ అయినా పూర్తి చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను అన్నారు.. పోలవరాన్ని కట్టే ఉద్దేశ్యం కేంద్రానికి లేదు.. అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్లోని పార్టీలకు లేదు అంటూ ఘాటు విమర్శలుచేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందో.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమూ అలాగే ఉందన్న ఆయన.. కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు భుజాలకెత్తుకున్నారని నాడు వైసీపీ ప్రశ్నించిందని గుర్తుచేశారు.. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని ఇప్పటి ఇరిగేషన్ మంత్రి చెప్పారు.. ఇందులో నిజముందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రానికి పోలవరం బాధ్యతలు ఎందుకు అప్పగించ లేదు..? అని నిలదీశారు ఉండవల్లి.. పోలవరంతో సహా విభజన హక్కులను సాధించుకునే పరిస్థితి లేదన్నారు. దానిపై గత కారణాలపై కూడా సీరియస్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
-
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
-
Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్కు డ్రాగన్ కంట్రీ సాయం..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!