AP SSC Supplementary Results: టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. 64.23 శాతం ఉత్తీర్ణత
ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి సప్లిమెంటరీ, బెటర్ మెంట్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. గత రెండేళ్లలో కోవిడ్ వల్ల తరగతలు జరగకపోవడం వల్ల టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందని.. దీంతో సప్లిమెంటరీ నిర్వహించి… రెగ్యులర్గా పాస్ అయిన విద్యార్థులతో సమానంగా గుర్తింపు ఇస్తున్నామని తెలిపారు.. సప్లిమెంటరీ పరీక్షలను బాలురు 1,09,413, బాలికలు 82,433 మంది రాయగా.. బాలురు 60 శాతానికి పైగా, బాలికలు 68 శాతం పాస్ అయ్యారని తెలిపారు.. 1,91,896 మంది పరీక్ష రాస్తే 1,31,233మంది పాస్ అయ్యారని.. మొత్తంగా 64.23 శాతం ఉత్తీర్ణత సాధించారని.. 87.52 శాతం విద్యార్థులు పాస్ కావడంతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో.. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 46.66 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారని వెల్లడించారు.
Read Also: Jyothula Chantibabu: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ఏ పార్టీలో ఎవరు శాశ్వతం…?
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
గత ప్రభుత్వ హయాంలో పదవ తరగతి పరీక్షలు చూసి రాసే పద్ధతికి మేం చెక్ పెట్టాం, పరీక్ష విధానంలో మామీద ఎన్నో విమర్శలు వచ్చాయి… మా విధానం మేం అనుసరిస్తామని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. ఈ ఒక్క సారికే సప్లిమెంటరీ పద్ధతి.. మరోసారి ఈ విధానం వుండదన్న ఆయన.. ప్రభుత్వ ఉద్దేశ్యం ఒక్కటే… పరీక్షలు పకడ్బందీగా నిర్వహించటం అన్నారు. పాఠశాలలు విలీనం జరగలేదు… క్లాసులు మాత్రమే విలీనం జరిగాయని.. ఎక్కడ తల్లితండ్రులు నుంచి మాకు ఇబ్బందులు లేవు, విద్యార్ధులకు ఇబ్బందులు వుంటే పరిశీలిస్తున్నామన్నారు.. క్లాసులు చెట్లు కింద నిర్వహిస్తున్నారు అని పత్రికల్లో వస్తున్నాయి… ఇలాంటి వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు.. పోటీతత్వంలో విద్యార్థులు రాణించాలనే విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తున్నామన్న ఆయన.. ఆగస్టు 15వ తేదీ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరిగారో.. తగ్గరో తెలియజేస్తాం అన్నారు.. ఇదే సమయంలో.. ప్రైవేట్ పాఠశాలలకు మేం వ్యతిరేకం కాదు.. మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు మంత్రి బొత్స.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు వుండాలని ఉపాధ్యాయులను కోరిన ఆయన.. నాడు – నేడు పనులు పూర్తయ్యాక డిజిటల్ క్లాస్ రూమ్స్ త్వరలో పెడతామని ప్రకటించారు. దేశంలో ఇలాంటి విధానం ఎక్కడ లేదు.. త్వరలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు ప్రారంభం అవుతాయని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో