AP SSC Supplementary Results: టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. 64.23 శాతం ఉత్తీర్ణత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి సప్లిమెంటరీ, బెటర్ మెంట్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. గత రెండేళ్లలో కోవిడ్ వల్ల తరగతలు జరగకపోవడం వల్ల టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందని.. దీంతో సప్లిమెంటరీ నిర్వహించి… రెగ్యులర్గా పాస్ అయిన విద్యార్థులతో సమానంగా గుర్తింపు ఇస్తున్నామని తెలిపారు.. సప్లిమెంటరీ పరీక్షలను బాలురు 1,09,413, బాలికలు 82,433 మంది రాయగా.. బాలురు 60 శాతానికి పైగా, బాలికలు 68 శాతం పాస్ అయ్యారని తెలిపారు.. 1,91,896 మంది పరీక్ష రాస్తే 1,31,233మంది పాస్ అయ్యారని.. మొత్తంగా 64.23 శాతం ఉత్తీర్ణత సాధించారని.. 87.52 శాతం విద్యార్థులు పాస్ కావడంతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో.. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 46.66 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారని వెల్లడించారు.
Read Also: Jyothula Chantibabu: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ఏ పార్టీలో ఎవరు శాశ్వతం…?
Also Read
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
గత ప్రభుత్వ హయాంలో పదవ తరగతి పరీక్షలు చూసి రాసే పద్ధతికి మేం చెక్ పెట్టాం, పరీక్ష విధానంలో మామీద ఎన్నో విమర్శలు వచ్చాయి… మా విధానం మేం అనుసరిస్తామని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. ఈ ఒక్క సారికే సప్లిమెంటరీ పద్ధతి.. మరోసారి ఈ విధానం వుండదన్న ఆయన.. ప్రభుత్వ ఉద్దేశ్యం ఒక్కటే… పరీక్షలు పకడ్బందీగా నిర్వహించటం అన్నారు. పాఠశాలలు విలీనం జరగలేదు… క్లాసులు మాత్రమే విలీనం జరిగాయని.. ఎక్కడ తల్లితండ్రులు నుంచి మాకు ఇబ్బందులు లేవు, విద్యార్ధులకు ఇబ్బందులు వుంటే పరిశీలిస్తున్నామన్నారు.. క్లాసులు చెట్లు కింద నిర్వహిస్తున్నారు అని పత్రికల్లో వస్తున్నాయి… ఇలాంటి వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు.. పోటీతత్వంలో విద్యార్థులు రాణించాలనే విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తున్నామన్న ఆయన.. ఆగస్టు 15వ తేదీ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరిగారో.. తగ్గరో తెలియజేస్తాం అన్నారు.. ఇదే సమయంలో.. ప్రైవేట్ పాఠశాలలకు మేం వ్యతిరేకం కాదు.. మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు మంత్రి బొత్స.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు వుండాలని ఉపాధ్యాయులను కోరిన ఆయన.. నాడు – నేడు పనులు పూర్తయ్యాక డిజిటల్ క్లాస్ రూమ్స్ త్వరలో పెడతామని ప్రకటించారు. దేశంలో ఇలాంటి విధానం ఎక్కడ లేదు.. త్వరలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు ప్రారంభం అవుతాయని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!