Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Undavalli Arun Kumar About Cm Ys Jagan Comments On Vizag Ap Capital

Undavalli Arun Kumar: రాజధానిపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. స్పందించనంటూనే..!

Published Date :January 31, 2023 , 5:49 pm
By Sudhakar Ravula
Undavalli Arun Kumar: రాజధానిపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. స్పందించనంటూనే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Undavalli Arun Kumar: ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు చర్చగా మారింది.. రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను అంటూ దౌత్య వేత్తల సమావేశంలో స్పష్టం చేశారు.. విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు సీఎం జగన్‌.. అయితే, సీఎం జగన్‌ కామెంట్లపై స్పందించనంటూనే హాట్‌ కామెంట్లు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. రాజధానిపై ఏం చేసినా చట్టబద్దత ఉండాలన్న ఆయన.. రాజధానిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై నేను మాట్లాడను.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సున్నితమైన అంశం.. కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి నేను స్పందించను అన్నారు.

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

ఇక, పోలవరం ప్రాజెక్టుపై కేవీపీ దాఖలు చేసిన పిల్‌లో నేను ఇంప్లీడయ్యాను.. 2017 నుంచి విచారణకు కోర్టులో రాలేదన్నారు.. చీఫ్ జస్టిస్ నాట్ బిఫోర్ మీ అని విచారణ నుంచి తప్పుకున్నారని తెలిపారు ఉండవల్లి.. ఛత్తీస్‌గడ్ తరపున అడ్వకేట్ జనరల్‌గా పోలవరం ప్రాజెక్ట్ తరపున వాదనలు వినిపించానని బెంచ్ నుంచి తప్పుకున్నారు. వేరే బెంచ్ కి బదిలీ చేస్తున్నట్లు సీజే చెప్పారన్నారు.. అయితే, మేం దాఖలు చేసిన పిటిషన్ పై వినడానికి ఏడేళ్లు సమయం పట్టిందని.. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరారు.. మరోవైపు, పొలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదన్నారు ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. సెక్షన్ 90 ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేయల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్న ఆయన.. 2014 రేట్ల ప్రకారమే ప్రాజెక్ట్ వ్యయం భరిస్తామని కేంద్రం చెబుతోంది.. 2014 రేట్లతో 2023లో ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యం అవుతుందా…? అని ప్రశ్నించారు.

Read Also: Etela Rajender : ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తున్నారు.. అందుకు వంద రెట్ల అవమానాలు మీకు తప్పవు

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని అందరు అనుకుంటున్నారు.. కానీ, అది అయ్యే అవకాశం లేదని హాట్‌ కామెంట్లు చేశారు ఉండవల్లి.. చంద్రబాబు 2014 రేట్ల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒప్పుకున్నారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.. ఎలా ఒప్పుకున్నారు చెప్పాలి అని ఆర్టీఐ ద్వారా అడిగితే ఆధారాలు లేవని చెబుతోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి హైకోర్టు వాదనలు విని ఉంటే మొత్తం అన్ని అంశాలు వివరించే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ పై కౌంటర్ ఫైల్ చేయలేదు.. ప్రాజెక్ట్ డయా ఫ్రంవాల్ ఉందో లేదో కొట్టుకుపోయిందని వార్తలు వస్తున్నాయి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే డిజైన్‌లో లోపాలు ఉన్నాయా అనేది చూడాల్సి వస్తుందన్నారు. రూ. 35 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చి పోలవరం ప్రాజెక్టు కట్టగలదా..? అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టులో 70 శాతం ఎలా అయ్యిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలవరం కాలువలు వైఎస్సార్ తవ్వాడు.. ఆర్ అండ్ ఆర్ పూర్తి కాకుండా చంద్రబాబు 70 శాతం ప్రాజెక్ట్ అయ్యిందని ఎలా చెప్తారు..? కాలువలు, రాక్ ఫీల్ డ్యాం, కాఫర్ డ్యాం, స్పిల్ వే, ఆర్ అండ్ అర్ ఇవన్ని కలిపితే పోలవరం ప్రాజెక్టు.. మెయిన్ డ్యాం నిర్మాణం అవ్వకుండా ప్రాజెక్ట్ అయిపోయిందని ఎలా చెబుతారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పై కౌంటర్ దాఖలు చేయలేదు.. కోర్టు మా వాదనలు వింటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఫేవరబుల్ ఆర్డర్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Capital
  • CM YS Jagan
  • Undavalli Arun Kumar
  • Vizag

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions