రుషికొండపై శ్రీవారి ఆలయాన్ని నిర్మించిన టీటీడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ రుషికొండపై టీటీడీ నిర్మించిన ఈ ఆలయం ఏడు కొండలవాడి వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం.. ఇవన్నీ చూస్తే మరో తిరుమలలా అనిపిస్తుంది. భీమిలి బీచ్ రోడ్డును ఆనుకుని కొండపై 10 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించింది టీటీడీ. ఆలయ నిర్మాణం, ఘాట్ రోడ్డు, ఇతరత్రా సదుపాయాల నిమిత్తం సుమారు 28 కోట్లు నిధులు ఖర్చు చేసింది. ఇప్పుడీ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అచ్చం తిరుమల ఆలయం మాదిరే.. విశాఖలోనూ వేంకటేశ్వరుడి ఆలయాన్ని నిర్మించారు. తిరుమలలో శిల్ప కళాకారులు తయారుచేసిన శ్రీవేంకటేశ్వరస్వామి, ఆంజనేయ స్వామి, శ్రీవారి పాదాలు, భూదేవి ఇతరత్రా విగ్రహాలను విశాఖకు తీసుకువచ్చారు. స్వామి వారి ఆభరణాలనూ పంపింది టీటీడీ.
Read: పెరుగుతున్న డెల్టాప్లస్ ఏవై3 వేరియంట్ కేసులు… అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక…
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
నిత్యం పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా ఇద్దరు అర్చకులను నియమించింది. కొండ కింది భాగంలో టిక్కెట్ కౌంటర్లు, ప్రసాద కౌంటర్లు, కల్యాణోత్సవ వేదిక, కార్యాలయాలను అందుబాటులోకి తేనున్నారు. వాస్తవానికి ఆలయం నిర్మాణ పనులు ఏడాది క్రితమే పూర్తి కావాల్సింది. కొవిడ్ కారణంగా ఆలస్యమైంది. ఇప్పటికీ పలు కారణాలతో.. ఆలయ ప్రారంభోత్సవం తేదీలు మారుతున్నాయి. ఉత్తరాయణంలో దేవస్థానాన్ని ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. ఆధ్యాత్మిక వాతావరణానికి పెట్టింది పేరైన ఉత్తరాంధ్రలో .. ఇప్పటికే సింహాద్రి అప్పన్న, కనక మహాలక్ష్మి దగ్గర నుంచి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వరకు.. ఎంతో మంది దేవుళ్లు భక్తుల పూజలందుకుంటున్నారు. ఇప్పుడు వెంకన్న వైభవం కూడా తోడైతే ఈ ప్రాంతం మరింత దేదీప్యమానమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
- Tags
- rushikonda
- Tirumala temple
- ttd
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!