TTD EO Shyamala Rao: గోశాలలో ఆవుల మృతి.. అసత్య ప్రచారంతో టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీయొద్దు..
- తిరుపతి ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై ఈవో శ్యామల రావు రియాక్షన్..
- గోశాలలో ఆవుల మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపిన ఈవో..
- అసత్యాలు ప్రచారం చేసి టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు: ఈవో శ్యామలరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD EO Shyamala Rao: తిరుపతి ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై టీటీడీ ఈఓ శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మూడు నెలల్లో వంద ఆవులు చనిపోయాయని తెలిపారు.. అసత్యాలు ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యవహరించారు.. సగటున నెలకు 15 ఆవులు చనిపోతాయి.. గడచిన మూడు నెలల్లో కేవలం 43 ఆవులు చనిపోయాయని ఆయన తేల్చి చెప్పారు. ఇక, దాతల నుంచి తీసుకున్న ఆవుల్లో కొన్ని అనారోగ్యంతో చనిపోయాయి.. మృతి చెందిన ఆవులకు పోస్టుమార్టం చేయ లేదనడం అవాస్తవం.. జూన్ 2024లో ఈఓగా బాధ్యతలు తీసుకొనే ముందు ముఖ్యమంత్రిని కలిశాను.. టీటీడీలో వ్యవస్థలు పాడయ్యాయి వాటిని సరి చేయాలని చెప్పారని శ్యామలరావు పేర్కొన్నారు.
Read Also: Kishan Reddy: అంబేద్కర్తో అనుబంధం, సంబంధం ఉన్న ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దారు..
Also Read
ఇక, 10 నెలల్లో ఎన్నో ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపరిచాం.. టీటీడీ ఐటీ విభాగంలో ఉన్నతస్థాయి అధికారి నియామకంలో నిబంధన గాలికి వదిలారు.. జీఎం స్థాయి అధికారిని నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారు.. ఐటీ విభాగంలో అక్రమాలు భారీగా జరిగాయి.. ఐటీ విభాగం వైఫల్యంతో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. దళారి ఒకరు 50 సార్లు ఆర్జిత సేవలు టికెట్ పొందారు.. అలాగే, నెయ్యి కొనుగోలులో అక్రమాలు జరిగాయి.. కల్తీ నెయ్యి సరఫరాను అరికట్టాం.. అన్న ప్రసాదంలో నాణ్యత లోపించింది.. గడచిన ఐదేళ్లలో వ్యవస్థలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈవో శ్యామలరావు చెప్పుకొచ్చారు.
Read Also: YSRCP: మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి..
అయితే, స్వామి వారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో పలు అక్రమాలు చేశారని శ్యామలరావు పేర్కొన్నారు. మూడు కోట్ల రూపాయల విలువైన సరుకులకు రూ.25 కోట్లు చెల్లించారు.. టీటీడీ గోశాల నిర్వహణలో ఎన్నో అక్రమాలు జరిగాయి.. మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు గోశాలలో భారీ అక్రమాలు చోటు చేసుకొన్నాయి.. గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలు దాచి పెట్టారు.. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం.. 2023లో విజిలెన్స్ అధికారులను గోశాలకు అనుమతించలేదు.. గోశాలలో అక్రమాలు బయట పెడతారనే భయంతో విజిలెన్స్ అధికారులను రానివ్వలేదు అని టీటీడీ ఈవో శ్యామలరావు ఆరోపించారు.
తాజావార్తలు
-
Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్ప్లే
-
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
-
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
-
Sonam Kapoor: పనిమనుషుల కోసం రూ.51 కోట్ల ఫ్లాట్లా? సోనమ్ టీమ్ క్లారిటీ!
-
SSC GD 2026: అభ్యర్థులకు అలర్ట్.. SSC GD కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు.. కొత్త ఎగ్జామ్ డేట్ ఇదే
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?