Double Bedroom House: డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Bedroom House: డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ముహూర్తు ఫిక్స్ చేశారు అధికారులు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో సెప్టెంబర్ 2 నుంచి రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై ఆగస్టు 19 (శనివారం) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, సుందరీకరణ, పంపిణీకి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. మొదటి దశలో 8 ప్రాంతాల్లో 12000 మందికి ఇళ్లను పంపిణీ చేయబోతున్నామని మంత్రి తెలిపారు. అర్హులైన అభ్యర్థులను గుర్తించి లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఆగస్టు 24న హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో డ్రా వేయనున్నట్లు తలసాని తెలిపారు.
Read also: Rajiler: జైలర్ కలెక్షన్స్ లో డ్రాప్… రజినీ కాళ్లు మొక్కడమే కారణమా?
Also Read
- Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
- Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
- DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
- Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు!
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలు ఎంతో ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే ప్రభుత్వం సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తోందని తలసాని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుపేదలకు, ఇళ్లులేని వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పిన సంగతి తెలిసిందే. జంటనగరాల్లో ఇప్పటికే 4,500 మంది లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను అందించారు. మరో 70 వేల ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మురికివాడల్లో నివసిస్తున్న పేదల గుడిసెలను తొలగించి డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అనంతరం ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. జీహెచ్ఎంసీలో సిబ్బంది కొద్దిరోజులుగా వెరిఫికేషన్ ప్రక్రియ చేస్తున్నారు. వెరిఫికేషన్ అనంతరం అర్హులైన అభ్యర్థుల పేర్లతో లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
Telangana Govt: ఖాతాలు స్తంభించిన నో ఫికర్.. లక్షలోపు రుణమాఫీ పక్కా చేస్తాం..
తాజావార్తలు
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
-
Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
-
Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!