TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం అని ఆయన తెలిపారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను ఆయన వెల్లడించారు. సెప్టంబర్ 27వ తేదీన శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం పట్టు వస్ర్తాలను సమర్పిస్తారు. భక్తులు రద్ది తగ్గే వరకు సర్వదర్శన భక్తులుకు ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తాం అన్నారు. సర్వదర్శన భక్తులకు స్లాటడ్ విధానంలో టోకేన్లు కేటాయింపు పై అధ్యయనం కొనసాగుతుందన్నారు సుబ్బారెడ్డి.
దేశవ్యాప్తంగా వైభవోత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది పాలకమండలి. ఆగస్ట్ 16 నుంచి 20వ తేది వరకు నెల్లూరులో వైభోత్సవాలు నిర్వహిస్తాం. 7.32 కోట్లతో యస్వీ గోశాలకు పసుగ్రాసం కోనుగోలు చేయాలని, 2.7 కోట్లతో పార్వేటి మంటపం నూతన నిర్ణయం చేస్తామన్నారు. 154 కోట్ల రూపాయల వ్యయంతో చిన్నపిల్లల ఆసుపత్రికి టెండర్లు ఖరారు చేస్తారు. 2.9 కోట్లతో అమరావతిలో ఆలయం వద్ద పచ్చదనం అభివృద్ది చేయనున్నారు. తిరుమలలోని యస్వీ పాఠశాలలో ఉన్నతప్రమాణాలతో విద్యను విద్యార్దులకు అందించేందుకు సింఘానియా గ్రూప్ తో ఒప్పందం చేసుకుంది.
Also Read
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
18 లక్షలతో బేడి ఆంజనేయస్వామి కి బంగారు కవచం ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నైలో రూ.6 కోట్లు,బెంగళురులో రూ.3.23 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా భక్తులు అందించారు. ఈ ఏడాది 33 లక్షల క్యాలండర్లు భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ప్రతి నెల 2.1 లక్షల సప్తగిరి మాస పత్రిక ముద్రణ చేస్తున్నామన్నారు. యంత్రాల సాయంతో లడ్డు ప్రసాదం బూందీ తయారీపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ప్రసాదాల తయారీకి వినియోగించే ఆర్గానిక్ ముడిసరుకుల కొనుగోలుకు మార్క్ ఫెడ్ తో ఒప్పందం చేసుకున్నాం. ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆగమపండితులు సలహ మేరకు నెల రోజులు తరువాత పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేయనుంది. అక్టోపస్ కోసం కేటాయించిన భవన నిర్మాణం కోసం అదనంగా 7 కోట్లు కేటాయించాం అని తెలిపారు.
President Elections: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్మూకే టీడీపీ మద్దతు
తాజావార్తలు
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో