Traffic diversions in Vijayawada: రాష్ట్రపతి పర్యటన.. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. వివరాలు ఇదిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఆమె పర్యటన కొనసాగనుంది.. తొలి పర్యటనలో రేపు ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగనుంది.. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరనున్న రాష్ట్రపతి.. ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. విమానాశ్రయంలో స్వాగతం పలకున్నారు గవర్నర్, సీఎం వైఎస్ జగన్.. గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా పోరంకి మురళి రిసార్టుకు చేరుకుంటారు రాష్ట్రపతి.. తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టు ఉంది.. అక్కడ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మానానికి ద్రౌపతి ముర్ము హాజరవుతారు. పౌర సన్మానం చేయనున్నారు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సన్మానం అనంతరం విజయవాడలోని రాజ్ భవన్ కు చేరుకుంటారు.. రాష్ట్రపతి గౌరవార్ధం రాజ్ భవన్లో అధికారిక విందు ఇవ్వనున్నారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2.15 నిమిషాల వరకు విందు జరగనుండగా.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి సహా అతికొద్ది మందికే గవర్నర్ ఆహ్వానం పంపారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
విందుకు ముఖ్యమంత్రి, హైకోర్టు సీజే జస్టిస్ పీకే మిశ్రా, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి ఛైర్మన్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, ఆర్టీఐ చీఫ్ కమిషనర్, ఏపీపీఎస్సీ ఛైర్మన్ తదితరులు మాత్రమే హాజరుకానున్నారు. ఇక, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు బయల్దేరనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అయితే, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. రేపు భారీ మరియు గూడ్స్ వాహనములకు అనుమతిలేదని స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ మళ్లించనున్నారు.. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వాహనములను ఇబ్రహీంపట్నం – జి.కొండూరు – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.. విశాఖపట్నం నుండి చెన్నై మధ్య రవాణా వాహనాల రాకపోకలను కూడా మళ్లించనున్నారు.. విశాఖపట్నం నుండి చెన్నై వైపు వెళ్ళే వాహనాలు హనుమాన్ జంక్షన్ – అవనిగడ్డ – రేపల్లె – బాపట్ల – చీరాల – త్రోవగుంట మీదుగా వెళ్లాల్సి ఉండగా.. చెన్నై నుండి విశాఖపట్నం వైపు వాహనాలు ప్రకాశం జిల్లా త్రోవగుంట వద్ద మళ్లించి చీరాల – బాపట్ల – రేపల్లె – అవనిగడ్డ – హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.. ఇక, గుంటూరు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనములు బుడంపాడు వద్ద నుండి పొన్నూరు–రేపల్లె –అవనిగడ్డ- హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!