Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Traffic Restrictions And Traffic Diversions In Vijayawada Due To President Draupadi Murmu Tour On December 4th

Traffic diversions in Vijayawada: రాష్ట్రపతి పర్యటన.. విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. వివరాలు ఇదిగో..

Published Date :December 3, 2022 , 9:50 pm
By Sudhakar Ravula
Traffic diversions in Vijayawada: రాష్ట్రపతి పర్యటన.. విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. వివరాలు ఇదిగో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఆమె పర్యటన కొనసాగనుంది.. తొలి పర్యటనలో రేపు ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగనుంది.. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరనున్న రాష్ట్రపతి.. ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. విమానాశ్రయంలో స్వాగతం పలకున్నారు గవర్నర్‌, సీఎం వైఎస్‌ జగన్.. గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా పోరంకి మురళి రిసార్టుకు చేరుకుంటారు రాష్ట్రపతి.. తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టు ఉంది.. అక్కడ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మానానికి ద్రౌపతి ముర్ము హాజరవుతారు. పౌర సన్మానం చేయనున్నారు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సన్మానం అనంతరం విజయవాడలోని రాజ్ భవన్ కు చేరుకుంటారు.. రాష్ట్రపతి గౌరవార్ధం రాజ్ భవన్‌లో అధికారిక విందు ఇవ్వనున్నారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2.15 నిమిషాల వరకు విందు జరగనుండగా.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి సహా అతికొద్ది మందికే గవర్నర్ ఆహ్వానం పంపారు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Also Read

  • Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
  • PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్‌తో పల్లెల్లో సరికొత్త విప్లవం
  • Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
  • AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..

విందుకు ముఖ్యమంత్రి, హైకోర్టు సీజే జస్టిస్ పీకే మిశ్రా, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి ఛైర్మన్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, ఆర్టీఐ చీఫ్ కమిషనర్, ఏపీపీఎస్సీ ఛైర్మన్ తదితరులు మాత్రమే హాజరుకానున్నారు. ఇక, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు బయల్దేరనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అయితే, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. రేపు భారీ మరియు గూడ్స్ వాహనములకు అనుమతిలేదని స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లించనున్నారు.. హైదరాబాద్‌ నుండి విశాఖపట్నం వెళ్లే వాహనములను ఇబ్రహీంపట్నం – జి.కొండూరు – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.. విశాఖపట్నం నుండి చెన్నై మధ్య రవాణా వాహనాల రాకపోకలను కూడా మళ్లించనున్నారు.. విశాఖపట్నం నుండి చెన్నై వైపు వెళ్ళే వాహనాలు హనుమాన్ జంక్షన్ – అవనిగడ్డ – రేపల్లె – బాపట్ల – చీరాల – త్రోవగుంట మీదుగా వెళ్లాల్సి ఉండగా.. చెన్నై నుండి విశాఖపట్నం వైపు వాహనాలు ప్రకాశం జిల్లా త్రోవగుంట వద్ద మళ్లించి చీరాల – బాపట్ల – రేపల్లె – అవనిగడ్డ – హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.. ఇక, గుంటూరు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనములు బుడంపాడు వద్ద నుండి పొన్నూరు–రేపల్లె –అవనిగడ్డ- హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • president draupadi murmu
  • President Draupadi Murmu Tour
  • Traffic Diversions
  • Traffic Police

తాజావార్తలు

  • Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..

  • Lakshmi Mittal: ఒకప్పుడు కాంక్రీట్ నేలపై నిద్రించిన లక్ష్మీ మిట్టల్.. నేడు రూ.2.37 లక్షల కోట్ల సంపదతో ఐపీఎల్ జట్టు ఓనర్

  • Operation Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా..

  • Tamannaah: విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత.. పెళ్లిపై తమన్నా క్లారిటీ..

  • Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions