Tomato Price: కిలో రూ.2… లబోదిబోమంటున్న టమోటా రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టమోటా ధర ఒక్కోసారి వినియోగదారులకు కన్నీళ్ళు తెప్పిస్తుంటుంది. నిన్న మొన్నటి వరకూ కేజీ 40-50 రూపాయలు పలికిన ధర ఇప్పుడు దిగి వచ్చింది. అయితే, రైతులకు మాత్రం నష్టాల్ని మిగులుస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణంగా పతనమైంది టమోటా ధర. అక్కడ కేవలం కిలో 2 రూపాయలు కూడా పలకకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమోటాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన టమోటా ధర ఒక్కసారిగా కుప్పకూలింది. కిలో టమోటా రెండురోజుల క్రితం 5 రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. తాజాగా కనీసం ఆ ధర కూడా లభించకపోవడంతో మార్కెట్ వరకూ తేవడానికి అయిన రవాణా ఖర్చులు కూడా రాక ఇబ్బంది పడుతున్నారు.
Read Also: Ponnam Prabhakar: ఆ కర్మాగారం ప్రారంభించడం.. అయిపోయిన పెళ్లికి మేళం వంటిది
Also Read
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమోటా రేట్లు ఓ రోజు తక్కువ గాను,మరో రోజు ఎక్కువగా ఉంటుంటాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు కిలో టమోటా 100 రూపాయలు పలికిన ధర.ప్రస్తుతం మార్కెట్ లో ఓ రోజు 10 రూపాయలు,మరో రోజు 5 రూపాయలకు, తాజాగా 2 రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు తమకు గిట్టుబాటు ధర కిలో టమోటా 30 రూపాయలకంటే ఎక్కువగా వుంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలు రావడంతో టమోటా పంటలు దెబ్బతినడంతో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా కిలో టమోటా 60 రూపాయల వరకూ ధర పలికింది. దీంతో కిలో టమోటా కూడా కొనలేక వినియోగదారులు ఆందోళన చెందారు. ఇప్పుడు వినియోగదారులు మార్కెట్లో 20 నుంచి 25 రూపాయల వరకూ కిలో టమోటా కొనుగోలు చేస్తున్నారు. కానీ రైతులకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. మధ్యలో దళారులు లాభపడుతున్నారని రైతులు అంటున్నారు. ఓ రోజు టమోటా రేట్లు పెరగడం మరో రోజు తగ్గడం మంచిది కాదని రైతులు అంటున్నారు. వేలకు వేలు పెట్టుబడిపెట్టి వేసిన టమోటా కూలి ఖర్చులు కూడా రావడంలేదని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితి రాకుండా వుండాలంటే.. పత్తికొండ ప్రాంతంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Chandrababu Naidu: హైదరాబాద్లో టెక్నాలజీ నా చలవే!
తాజావార్తలు
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!