Tomato Price: కిలో రూ.2… లబోదిబోమంటున్న టమోటా రైతులు
టమోటా ధర ఒక్కోసారి వినియోగదారులకు కన్నీళ్ళు తెప్పిస్తుంటుంది. నిన్న మొన్నటి వరకూ కేజీ 40-50 రూపాయలు పలికిన ధర ఇప్పుడు దిగి వచ్చింది. అయితే, రైతులకు మాత్రం నష్టాల్ని మిగులుస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణంగా పతనమైంది టమోటా ధర. అక్కడ కేవలం కిలో 2 రూపాయలు కూడా పలకకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమోటాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన టమోటా ధర ఒక్కసారిగా కుప్పకూలింది. కిలో టమోటా రెండురోజుల క్రితం 5 రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. తాజాగా కనీసం ఆ ధర కూడా లభించకపోవడంతో మార్కెట్ వరకూ తేవడానికి అయిన రవాణా ఖర్చులు కూడా రాక ఇబ్బంది పడుతున్నారు.
Read Also: Ponnam Prabhakar: ఆ కర్మాగారం ప్రారంభించడం.. అయిపోయిన పెళ్లికి మేళం వంటిది
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమోటా రేట్లు ఓ రోజు తక్కువ గాను,మరో రోజు ఎక్కువగా ఉంటుంటాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు కిలో టమోటా 100 రూపాయలు పలికిన ధర.ప్రస్తుతం మార్కెట్ లో ఓ రోజు 10 రూపాయలు,మరో రోజు 5 రూపాయలకు, తాజాగా 2 రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు తమకు గిట్టుబాటు ధర కిలో టమోటా 30 రూపాయలకంటే ఎక్కువగా వుంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలు రావడంతో టమోటా పంటలు దెబ్బతినడంతో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా కిలో టమోటా 60 రూపాయల వరకూ ధర పలికింది. దీంతో కిలో టమోటా కూడా కొనలేక వినియోగదారులు ఆందోళన చెందారు. ఇప్పుడు వినియోగదారులు మార్కెట్లో 20 నుంచి 25 రూపాయల వరకూ కిలో టమోటా కొనుగోలు చేస్తున్నారు. కానీ రైతులకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. మధ్యలో దళారులు లాభపడుతున్నారని రైతులు అంటున్నారు. ఓ రోజు టమోటా రేట్లు పెరగడం మరో రోజు తగ్గడం మంచిది కాదని రైతులు అంటున్నారు. వేలకు వేలు పెట్టుబడిపెట్టి వేసిన టమోటా కూలి ఖర్చులు కూడా రావడంలేదని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితి రాకుండా వుండాలంటే.. పత్తికొండ ప్రాంతంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Chandrababu Naidu: హైదరాబాద్లో టెక్నాలజీ నా చలవే!
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో