Tomato Price: కిలో రూ.2… లబోదిబోమంటున్న టమోటా రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టమోటా ధర ఒక్కోసారి వినియోగదారులకు కన్నీళ్ళు తెప్పిస్తుంటుంది. నిన్న మొన్నటి వరకూ కేజీ 40-50 రూపాయలు పలికిన ధర ఇప్పుడు దిగి వచ్చింది. అయితే, రైతులకు మాత్రం నష్టాల్ని మిగులుస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణంగా పతనమైంది టమోటా ధర. అక్కడ కేవలం కిలో 2 రూపాయలు కూడా పలకకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమోటాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన టమోటా ధర ఒక్కసారిగా కుప్పకూలింది. కిలో టమోటా రెండురోజుల క్రితం 5 రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. తాజాగా కనీసం ఆ ధర కూడా లభించకపోవడంతో మార్కెట్ వరకూ తేవడానికి అయిన రవాణా ఖర్చులు కూడా రాక ఇబ్బంది పడుతున్నారు.
Read Also: Ponnam Prabhakar: ఆ కర్మాగారం ప్రారంభించడం.. అయిపోయిన పెళ్లికి మేళం వంటిది
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమోటా రేట్లు ఓ రోజు తక్కువ గాను,మరో రోజు ఎక్కువగా ఉంటుంటాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు కిలో టమోటా 100 రూపాయలు పలికిన ధర.ప్రస్తుతం మార్కెట్ లో ఓ రోజు 10 రూపాయలు,మరో రోజు 5 రూపాయలకు, తాజాగా 2 రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు తమకు గిట్టుబాటు ధర కిలో టమోటా 30 రూపాయలకంటే ఎక్కువగా వుంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలు రావడంతో టమోటా పంటలు దెబ్బతినడంతో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా కిలో టమోటా 60 రూపాయల వరకూ ధర పలికింది. దీంతో కిలో టమోటా కూడా కొనలేక వినియోగదారులు ఆందోళన చెందారు. ఇప్పుడు వినియోగదారులు మార్కెట్లో 20 నుంచి 25 రూపాయల వరకూ కిలో టమోటా కొనుగోలు చేస్తున్నారు. కానీ రైతులకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. మధ్యలో దళారులు లాభపడుతున్నారని రైతులు అంటున్నారు. ఓ రోజు టమోటా రేట్లు పెరగడం మరో రోజు తగ్గడం మంచిది కాదని రైతులు అంటున్నారు. వేలకు వేలు పెట్టుబడిపెట్టి వేసిన టమోటా కూలి ఖర్చులు కూడా రావడంలేదని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితి రాకుండా వుండాలంటే.. పత్తికొండ ప్రాంతంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Chandrababu Naidu: హైదరాబాద్లో టెక్నాలజీ నా చలవే!
తాజావార్తలు
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!