Ponnam Prabhakar: ఆ కర్మాగారం ప్రారంభించడం.. అయిపోయిన పెళ్లికి మేళం వంటిది
Ponnam Prabhakar Demands To PM Narendra Modi: రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం.. అయిపోయిన పెళ్లికి మేళాలు వహించినట్టుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కౌంటర్లు వేశారు. మూతపడ్డ ఆ పరిశ్రమను ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15,000 కోట్లు ఇచ్చిందని.. ఏడాదిన్నరగా ఎరువులు ఉత్పత్తి కూడా కొనసాగుతోందని అన్నారు. ఇప్పుడు దాన్ని కొత్తగా ప్రారంభించడం ఏంటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన మోడీ.. ప్రజలకు క్షమాపణ చెప్పి, ఆ తర్వాతే రాష్ట్రంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. అసలు విభజన హామీలను అమలు చేయని ప్రధాని.. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని నిలదీశారు.
తెలంగాణ కోసం ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి, ఎందరో ప్రాణాలు అర్పిస్తే.. సుష్మా స్వరాజ్ లోక్ సభలో మద్దతు ఇచ్చారని, ఆ తర్వాతే తెలంగాణ బిల్లు పాస్ అయ్యిందని పొన్నాల ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. అయితే.. ఆ తెలంగాణ బిల్లును కించపరిచే విధంగా, పార్లమెంట్లో తలుపులు మూసి దొంగతనంగా బిల్లును ప్రవేశపెట్టారని, తెలంగాణ ఏర్పాటనేది దేశ విభజన కోరుకునేవారు చేశారని, తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారన్నారు. అందుకే క్షమాపణ చెప్పి, తెలంగాణ గడ్డపై కాలుమోపాలని మోడీని డిమాండ్ చేశారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం బొగ్గు గనులు, ఎయిమ్స్, తెలంగాణలో మెడికల్ కాలేజీలు, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ఏర్పాటు పట్ల.. ఇప్పటికీ మోడీ వివక్ష చూపుతూనే ఉన్నారన్నారు. వీటి మీద ప్రశ్నించాల్సిన టీఆర్ఎస్ పార్టీ.. ఎనిమిదేళ్లుగా బీజేపీకి అనుబంధ సంస్థగా పనిచేస్తోందని ఆరోపించారు.
Also Read
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్మెంట్ మొదలైందా?
దేశంలో మూతపడి ఉన్న 5 కర్మాగారాలను తిరిగి ప్రారంభించాలని 2013లోనే ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించారని.. కాంగ్రెస్ పుణ్యంతోనే రామగుండం ఎరువుల కర్మాగార పునరుద్ధరణ జరుగుతోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. 1999లో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆ సంస్థ మూసివేయబడిందని.. 1999-2004 వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని తెరిచే ప్రయత్నం చేయలేదని తూర్పారపట్టారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కర్మాగారంపై ఉన్న రుణాలు, బ్యాంకు అప్పులు మొత్తం రూ. 10 వేల కోట్లు మాఫీ చేశారన్నారు. 2013లో రూ.5,600 కోట్ల పెట్టుబడితో ఆ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడానికి కేబినేట్ తీర్మానం చేసిందని, సీసీఈఏలో సైతం ఆమోదం తెలిపిందని అన్నారు. 2019లో ట్రయల్స్ పూర్తి చేసుకొని.. ఏడాదిన్నర క్రితం ఉత్పత్తి ప్రారంభించిందన్నారు.
తాజావార్తలు
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
-
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
-
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
-
Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!