ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 624 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరో 04 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇక ఇదే సమయంలో 810 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,87,44,941 కు చేరుకున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14,254 కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7,944 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది. ఇక, పాజిటివ్ కేసుల సంఖ్య 20,57,252 కు పెరిగితే.. కోలుకున్నవారి సంఖ్య 20,35,054 కు చేరుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 38,312 శాంపిల్స్ పరీక్షించినట్లు పేర్కొంది సర్కార్.