RK Roja: రైతుల విజయం.. వైసీపీ విజయం.. ఆ బాధ్యత కూడా ప్రభుత్వానిదే..
- తోతాపురి మామిడి రైతులకు గుడ్ న్యూస్..
- 40,795 మంది రైతుల ఖాతాల్లో రూ.185.02 కోట్ల నగదు జమ..
- ఇది రైతుల విజయం.. వైసీపీ విజయంగా పేర్కొన్న ఆర్కే రోజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: తోతాపురి మామిడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 40,795 మంది రైతుల ఖాతాల్లో రూ.185.02 కోట్ల నగదు జమ చేసింది.. దీనిపై స్పందించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా.. ఇది రైతుల విజయం.. వైసీపీ విజయంగా అభివర్ణించారు.. మామిడి రైతులకు న్యాయం చేయాలని మాజీ సీఎం జగన్, వైఎస్సార్సీపీ పోరాటం చేసింది.. మామిడి రైతులకు మద్దతుగా జగన్ బంగారుపాళ్యం వచ్చినప్పుడు తప్పించుకొని ధోరణిలో ప్రభుత్వం హామీ ఇచ్చింది.. ప్రభుత్వం తరపున రూ. 4, ఫ్యాక్టరీ తరపున రూ. 8 ఇస్తామని వాగ్దానం చేశారు.. నాలుగు, ఐదు నెలలుగా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసింది ఈ ప్రభుత్వం అని దుయ్యబట్టారు..
Read Also: Mahabharath: క్యాన్సర్ తో మహాభారత్ నటుడి మృతి.. కర్ణుడి పాత్రలో…
Also Read
మద్దతు ధర కోసం రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం తరపున చేశాం.. ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన రూ. 4 లెక్కన నేడు డబ్బులు విడుదల చేసింది.. 40,795 మంది రైతులకు, 46,000 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడికాయలకు రూ. 185 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది అన్నారు.. అయితే, ఇది రైతుల విజయం, వైఎస్సార్సీపీ విజయంగా పేర్కొన్నారు.. అయితే, ఫ్యాక్టరీల నుంచి రావాల్సిన రూ. 370 కోట్లను కూడా ప్రభుత్వం ఇప్పించాలని డిమాండ్ చేశారు.. ప్రభుత్వం హామీ ఇవ్వడంతోనే రైతులు ధైర్యంగా ఫ్యాక్టరీలకు మామిడికాయలు తోలారు.. రూ. 370 కోట్లు రైతులకు చేరే వరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
-
Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
-
NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
-
AP Assembly: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్తో ప్రారంభం కానున్న శాసనసభ!
ట్రెండింగ్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!