Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Kumar Reddy: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లులో ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని ఇతర వృత్తులతో పోలిస్తే రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, దూషణలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. డాక్టర్లు, న్యాయవాదులు వంటి వృత్తుల్లో ఉన్నవారు ఒకరినొకరు గౌరవించుకుంటూ, అవసరమైనప్పుడు పరస్పరం మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. కానీ, రాజకీయాల్లో మాత్రం వ్యక్తిగత విమర్శలు ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలు ప్రజలకు సంబంధించిన అంశమని, పాలసీలు, అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చలు జరగాలని సూచించారు కిరణ్.. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలతో రాజకీయాల స్థాయి దిగజారుతోందని వ్యాఖ్యానించారు. ఇక, ప్రస్తుత టెలివిజన్ డిబేట్లు కుటుంబ సభ్యులతో కలిసి చూసే పరిస్థితి లేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కొన్ని చర్చలు చూస్తే టీవీనే ఆఫ్ చేయాలనిపించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో అసభ్య పదజాలం వినియోగించడం కూడా మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రాజకీయ నాయకుల మధ్య పరస్పర గౌరవం ఉండాలని, ఒకరి గౌరవాన్ని మరొకరు తగ్గించుకునే ధోరణి వల్లే రాజకీయ విలువలు క్షీణిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..
Also Read
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!