RK Roja: రెడ్బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదు.. సంచలన వ్యాఖ్యలు
- చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు- రోజా
- ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టి వేధిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు
- రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదు- ఆర్కే రోజా.
చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదని ఆరోపించారు. ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టి వేదిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువయ్యాయి… ఇలాంటి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడుతారని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదని దుయ్యబట్టారు. జగన్ హయంలో శాంతి భద్రతలు బాగున్నాయి.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు.. రోడ్డు మీదే ప్రజలను నరికేస్తున్నారని రోజా తెలిపారు.
Read Also: Gottipati Ravi Kumar: చంద్రబాబు కారణంగానే అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో తెలుగు వారు!
Also Read
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Prakash Raj Faces Defamation Suit: ప్రకాష్ రాజ్కు షాక్.. వంద కోట్ల పరువు నష్టం దావా..!
- MLA Pulivarthi Nani: చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్.. “సినిమా చూపిస్తా”..!
లోకేష్, చంద్రబాబు వల్ల ఒక్క ఎంవోయూలు చేయలేదు.. 20 కోట్లు ఖర్చు పెట్టి దావోస్ వెళ్ళి.. ఖాళీ చేతులతో వచ్చారని ఆర్కే రోజా విమర్శించారు. స్పెషల్ ఫ్లైట్, సూట్లు, బూట్లు అంటూ కోట్లు ఖర్చు పెట్టారు.. దావోస్లో లక్ష ఇరవై వేల కోట్లను విశాఖపట్నంలో 13.5 లక్షల కోట్లు జగన్ పెట్టుబడులు తెచ్చారని తెలిపారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ప్రాజెక్టులు అన్ని జగన్ అన్న తెచ్చినవేనని అన్నారు. చంద్రబాబు మత్తులో పవన్ కల్యాణ్ ఉన్నాడని దుయ్యబట్టారు.
పవన్ కల్యాణ్ను దావోస్కు చంద్రబాబు ఎందుకు తీసుకుపోలేదని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు ఏడు నెలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. తిరుమల పవిత్రతను పాడుచేశారు.. చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మానేయాలని తెలిపారు. దావోస్ పర్యటనలో ఒక్క ఎంవోయూ జరగకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మరోవైపు.. తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు ఎలాంటి సహాయం చేయకుండా గాలికి వదిలేశారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!