RK Roja: రెడ్బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదు.. సంచలన వ్యాఖ్యలు
- చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు- రోజా
- ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టి వేధిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు
- రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదు- ఆర్కే రోజా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదని ఆరోపించారు. ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టి వేదిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువయ్యాయి… ఇలాంటి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడుతారని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదని దుయ్యబట్టారు. జగన్ హయంలో శాంతి భద్రతలు బాగున్నాయి.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు.. రోడ్డు మీదే ప్రజలను నరికేస్తున్నారని రోజా తెలిపారు.
Read Also: Gottipati Ravi Kumar: చంద్రబాబు కారణంగానే అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో తెలుగు వారు!
Also Read
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
- Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
- Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్కు నివాళి.. మావిగన్పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
లోకేష్, చంద్రబాబు వల్ల ఒక్క ఎంవోయూలు చేయలేదు.. 20 కోట్లు ఖర్చు పెట్టి దావోస్ వెళ్ళి.. ఖాళీ చేతులతో వచ్చారని ఆర్కే రోజా విమర్శించారు. స్పెషల్ ఫ్లైట్, సూట్లు, బూట్లు అంటూ కోట్లు ఖర్చు పెట్టారు.. దావోస్లో లక్ష ఇరవై వేల కోట్లను విశాఖపట్నంలో 13.5 లక్షల కోట్లు జగన్ పెట్టుబడులు తెచ్చారని తెలిపారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ప్రాజెక్టులు అన్ని జగన్ అన్న తెచ్చినవేనని అన్నారు. చంద్రబాబు మత్తులో పవన్ కల్యాణ్ ఉన్నాడని దుయ్యబట్టారు.
పవన్ కల్యాణ్ను దావోస్కు చంద్రబాబు ఎందుకు తీసుకుపోలేదని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు ఏడు నెలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. తిరుమల పవిత్రతను పాడుచేశారు.. చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మానేయాలని తెలిపారు. దావోస్ పర్యటనలో ఒక్క ఎంవోయూ జరగకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మరోవైపు.. తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు ఎలాంటి సహాయం చేయకుండా గాలికి వదిలేశారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?