Bhumana Karunakar Reddy: జగన్ను దెబ్బ తీసేందుకు హిందువుల మనోభావాలతో చంద్రబాబు, పవన్ ఆడుకున్నారు..
- చంద్రబాబు ఆరోపించినట్లుగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ రిపోర్టు..
- ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఇంత రాక్షసంగా వ్యవహరించలేదు..
- చంద్రబాబు కుట్ర బయటపడింది.. హిందువులంతా వాస్తవాలను గమనించాలి..
- జగన్ను దెబ్బ తీసేందుకు హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు: భూమన కరుణాకర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదన్న సీబీఐ రిపోర్టుతో ఎన్టీవీతో టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..రాజకీయ లబ్ధి కోసం మా అధినేతలపై కుట్రలు చేశారు. తిరుమల లడ్డూ నెయ్యిలో పందికొవు లేదా ఇతర జంతువుల పదార్థాలు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. ఇక, సీబీఐ చేసిన విచారణలో, పంది కొవ్వు సహా ఏ జంతు కొవ్వు పదార్థాలు లడ్డులో లేవని తుది నివేదికలో స్పష్టంగా తేలిపోయింది.. డైరీ నిర్వాహకులు, అధికారులు చేసిన ఈ కుట్రను రాజకీయ దురుద్దేశంతో వైఎస్ జగన్పై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నించారని భూమన పేర్కొన్నారు.
Read Also: Gold & Silver Prices: కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన కారణాలు ఇవే..
Also Read
- Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్కు నివాళి.. మావిగన్పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
అయితే, పవన్ కళ్యాణ్ తిరుపతిలో బహిరంగ సభలో ఇష్టానుసారంగా మాట్లాడి, లక్షల లడ్డులను అయోధ్యకు పంపామంటూ అబద్ధాలు చెప్పాడు అని మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు. శుభ్రం చేయాల్సింది గుడిమెట్లను కాదు, నీ నాలుకను అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలు ప్రజలు కూడా గమనిస్తున్నారు.. ఒక బాధ్యతాయుత హోదాలో ఉండి, కోట్లాది మంది హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశాడని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ చేసిన ఆరోపణలపై మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం.. రేపు కూటమి ప్రభుత్వం చేసిన అపచారంపై తిరుపతిలోని శ్రీనివాస నిందా పరిహార హోమం చేపడతామని భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
-
Harish Rao: “త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా”.. హరీష్ రావు సంచలన ప్రకటన..
-
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
-
Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
-
Microsoft: ‘‘ఇది ఆరంభం మాత్రమే’’.. ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ బాంబ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..