Tirupati : తిరుమలకు మరో అరుదైన రికార్డ్
- ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీవారి వైభవం
- 3.45 లక్షల మంది భక్తులతో తిరుమల కిటకిట
- అన్నప్రసాదంలో టీటీడీ సరికొత్త రికార్డు
- భద్రత, సౌకర్యాల్లో పకడ్బందీ ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యజయంతి రోజైన రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఈ శోభాయాత్ర, రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు నిరంతరాయంగా కొనసాగింది. చిన్న శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై మాడ వీధుల్లో మలయప్ప స్వామి విహరిస్తుంటే భక్తులు గోవింద నామస్మరణతో పరవశించిపోయారు. సుమారు 3.45 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండి ఈ వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించారు. కేవలం భక్తులే కాకుండా, రికార్డు స్థాయిలో 14,500 వాహనాలు ఈ ఒక్క రోజే తిరుమల కొండకు చేరుకోవడం విశేషం.
T20 world cup: టీ20 వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు.. లిస్ట్ లో ఎవరెవరున్నారంటే?
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్నప్రసాద విభాగం మునుపెన్నడూ లేని విధంగా భారీ ఏర్పాట్లు చేసింది. గ్యాలరీల్లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా ఆహారం, నీరు అందించింది. ఈ ఏడాది రథసప్తమి రోజున మొత్తం 9.42 లక్షల మందికి అన్నప్రసాదాలను పంపిణీ చేసి టీటీడీ రికార్డు సృష్టించింది. కేవలం భోజనం మాత్రమే కాకుండా, సుమారు 6.41 లక్షల మందికి కాఫీ, టీ, పాలు , టిఫిన్లను పంపిణీ చేశారు. ఎండ వేడిని తట్టుకునేలా భక్తులకు దాదాపు 4 లక్షల వాటర్ బాటిళ్లను ఉచితంగా అందజేయడం టీటీడీ సేవా నిరతికి నిదర్శనంగా నిలిచింది.
వేలాది మంది శ్రీవారి సేవకులు , టీటీడీ సిబ్బంది సమన్వయంతో ఈ వేడుకను విజయవంతం చేశారు. గ్యాలరీల్లో భక్తులకు ఎండ తగలకుండా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా, క్యూ లైన్లలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు తాగునీరు, మజ్జిగ సరఫరా చేశారు. టీటీడీ ఈఓ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూశారు. ఆధ్యాత్మిక ఉత్సవాలతో పాటు భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేసిన ఈ భారీ ఏర్పాట్లు భక్తుల ప్రశంసలు అందుకున్నాయి. తిరుమల చరిత్రలో అత్యంత క్రమశిక్షణతో , వైభవంగా జరిగిన రథసప్తమి వేడుకల్లో ఇది ఒకటిగా నిలిచిపోనుంది.
KING Nagarjuna : 100 వ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న కింగ్
తాజావార్తలు
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!