Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ
- సోషల్ మీడియా ఫోటోలే హత్యకు కారణం
- ప్రియురాలి విషయంలో పెరిగిన వివాదం
- మద్యం తాగించి కిరాతక హత్య
- చెరువులో మృతదేహం.. పోలీసుల విచారణలో నిజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి జిల్లాలోని తవణంపల్లి మండలంలో ఇటీవల చోటుచేసుకున్న యువకుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోల కారణంగానే ఈ కిరాతక హత్య జరిగినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యువరాజ్తో పాటు, అతనికి సహకరించిన ఒక మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కిడ్నీ రాళ్లు కరిగించాలా? ఈ డైట్ తప్పనిసరి!
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
పోలీసుల కథనం ప్రకారం.. మోదలపల్లి గ్రామానికి చెందిన యువరాజ్ అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే, అదే గ్రామానికి చెందిన లవకుమార్ అనే మరో యువకుడు సదరు యువతితో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్లు , డీపీలుగా పెట్టుకున్నాడు. తన ప్రియురాలితో కలిసి ఫోటోలు దిగడమే కాకుండా, వాటిని బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై యువరాజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంలో లవకుమార్ను పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, అతడిని అంతం చేయాలని యువరాజ్ పథకం వేశాడు.
ఈ నెల ఒకటో తేదీన రాత్రి యువరాజ్ తన వద్ద పనిచేసే ఒక మైనర్ బాలుడితో కలిసి లవకుమార్ను కొత్త చెరువు వద్దకు పిలిపించాడు. అక్కడ పథకం ప్రకారం లవకుమార్కు భారీగా మద్యం తాగించి మత్తులోకి జారుకునేలా చేశాడు. లవకుమార్ పూర్తిగా స్పృహ కోల్పోయిన సమయంలో, యువరాజ్ తన వద్ద ఉన్న పదునైన బ్లేడ్తో అతని గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహం ఎవరికీ దొరకకూడదని, గుర్తుపట్టలేని విధంగా డీకాంపోజ్ కావాలని భావించి సమీపంలోని చెరువులో పడవేశారు.
హత్య జరిగిన రెండు రోజుల తర్వాత చెరువులో మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తవణంపల్లి పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడి కాల్ డేటా , సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా యువరాజ్పై అనుమానం కలిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!