Tirumala: సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కరోనా తీవ్రత తగ్గడంతో భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ 60 నుంచి 70 వేలమంది భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకుంటున్నారు. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మాఢ వీధుల్లో వాహనసేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవోలు, అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో వివరించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. అక్టోబరు 1న గరుడ వాహనం, అక్టోబరు 2న స్వర్ణరథం, అక్టోబరు 4న రథోత్సవం, అక్టోబరు 5న చక్రస్నానం జరుగుతాయని తెలియజేశారు.
Also Read
- AP High Court: ‘వెళ్లి సరెండర్ అవ్వండి’.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడి అరెస్ట్..
- YS Jagan: చీకటి కొంతకాలమే.. వెలుగు రాక తప్పదు.. పాదయాత్ర ప్రారంభిస్తా..
Tirumala: శ్రీవారి హుండీకి కాసుల వర్షం.. ప్రతినెలా రూ.100 కోట్లకు పైమాటే
కరోనా కారణంగా గతంలో రెండు పర్యాయాలు వాహనసేవలు ఏకాంతంగా నిర్వహించారు. ఈసారి మాఢ వీధుల్లో వాహనసేవల ఊరేగింపు ఉంటుందని ఈవో చెప్పారు. ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశముందని, ఇందుకనుగుణంగా పటిష్టంగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో వృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. ఈసారి గరుడసేవ పెరటాసి మాసంలో మూడో శనివారం రోజున జరుగనుందని, భక్తులు విశేషంగా విచ్చేసే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపడతామని వివరించారు.
తిరుమలలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని, అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లోనూ పరిశుభ్రంగా ఉంచుతామని ఈవో తెలిపారు. వైద్య విభాగం ఆధ్వర్యంలో అవసరమైన ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు ఏర్పాటు చేస్తామన్నారు. రుయా, స్విమ్స్ ఆసుపత్రుల నుంచి స్పెషలిస్టు డాక్టర్లను రప్పించి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రత కల్పిస్తామని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తగినన్ని ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేస్తామన్నారు. గరుడసేవ నాడు భక్తులు ద్విచక్ర వాహనాలను తిరుపతిలోనే పార్క్ చేసి బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలని కోరారు.
భక్తులందరికీ అన్నప్రసాదాలు అందిస్తామని, మాఢ వీధుల్లోని గ్యాలరీల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటుచేసి తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామని తెలిపారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నందున భక్తుల తమతోపాటు గాజు లేదా రాగి లేదా స్టీల్ బాటిళ్లు వెంట తెచ్చుకోవాలని కోరారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంజినీరింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణాశేషాచల దీక్షితులు, అదనపు ఎస్పీ మునిరామయ్య, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tirumala: సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల
తాజావార్తలు
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
AP High Court: ‘వెళ్లి సరెండర్ అవ్వండి’.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. మంటల్లో రాజధాని మాస్కో..
-
Modi-Trump: జీ7 వేదికగా మోడీతో దిగిన ఆసక్తికర ఫొటో షేర్ చేసిన ట్రంప్
ట్రెండింగ్
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!