TTD Vaikunta Ekadasi 2025 Tickets: వైకుంఠ ద్వార దర్శనం టికెట్లకు ఫుల్ డిమాండ్.. నిమిషాల్లోనే కోటా పూర్తి..
- శ్రీవారి వైకుంఠద్వార దర్శనం టికెట్లకు ఫుల్ డిమాండ్..
- ఆన్ లైన్ లో విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లు బుకింగ్ పూర్తి..
- 1,40,000 టికెట్లను 18 నిమిషాల వ్యవధిలోనే కొనుగోలు చేసిన భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Vaikunta Ekadasi 2025 Tickets: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తు ఉంటారు. శ్రీవారి ఆలయంలో ఏడాదికి పది రోజులపాటు మాత్రమే భక్తులను అనుమతించే వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రతి హిందూ భక్తుడు పరితపిస్తూ ఉంటారు. దీనితో వైకుంఠ ద్వార దర్శనానికి డిమాండ్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూ వస్తూ ఉంది. ఈ ఏడాది కూడా టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది టీటీడీ. గత ఏడాది తరహలోనే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టికెట్లను ముందస్తుగానే కేటాయించేలా ఏర్పాటు చేస్తుంది టీటీడీ.. ఆన్లైన్ సంబంధించిన టికెట్లను 23 ,24వ తేదీలలో విడుదల చేయగా ఆఫ్లైన్కు సంబంధించిన టికెట్లను జనవరి ఎనిమిదో తేదీ రాత్రి నుంచి విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 18 వందల చొప్పున 10 రోజులకు సంబంధించి 18 వేల టికెట్లను విడుదల చేయగా.. పదివేల 500 విలువచేసే శ్రీవాణి టికెట్లను భక్తులు గంటన్నర సమయంలోనే కొనుగోలు చేసేశారు. ఇక, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి పది రోజులకు సంబంధించి 1,40,000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయగా కేవలం 18 నిమిషాల వ్యవధిలోనే భక్తులు వాటిని కొనుగోలు చేసేశారు. లక్షా 40 వేల టికెట్ల కోసం టీటీడీ వెబ్ సైట్ కి 14 లక్షల హిట్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు.. స్వామివారి దర్శన టికెట్లకు ఉన్న డిమాండ్. కోటా ముగిసిన భక్తులు టిక్కెట్లు కోసం ప్రయత్నిస్తూనే వున్నారు.
Read Also: Pushpa 2: బాలీవుడ్ స్టార్ హీరోలకు బిగ్ టార్గెట్ ఇచ్చిన పుష్పరాజ్!
Also Read
ఇక, సర్వదర్శనం భక్తులకు సంబంధించి ప్రతినిత్యం 40,000 చొప్పున 10 రోజులకు సంబంధించి నాలుగు లక్షల టికెట్లను ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసేలా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. 8వ తేదీ రాత్రి ముందుగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆ తర్వాత రోజులకు సంబంధించిన టికెట్లను 1,20,000 టికెట్లను తిరుపతిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.. తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాలతో పాటు తిరుమలలో ఒక ప్రాంతం కలిపి మొత్తంగా 91 కౌంటర్ల ద్వారా ఈ టికెట్లను భక్తులకు జారీ చేసేలా టీటీడీ ముందస్తుగా ఏర్పాటు చేస్తుంది. అటు తర్వాత మిగిలిన ఏడు రోజులకు సంబంధించి ఏ రోజు ఆరోజు కోటాను ముందస్తుగా విడుదల చేయనున్నారు. దీంతో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ముందస్తుగానే తిరుపతికి చేరుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!