TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్..
- టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ట్విస్ట్..
- నెయ్యి కల్తీ జరిగిందని ఈస్ట్ పీఎస్లో ఫిర్యాదు చేసిన అప్పటి జీఎం మురళీకృష్ణ..
- తాజాగా 11 మందిని నిందితులుగా చేరుస్తూ మెమో దాఖలు చేసిన సిట్..
- ఫిర్యాదు చేసినా మురళీకృష్ణ పై కేసు నమోదు చేసినా సిట్
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రారంభంలో ఫిర్యాదు చేసిన అధికారుల పేర్లు కూడా ఇప్పుడు నిందితుల జాబితాలో చేరాయి. ఈ సందర్భంగా సిట్ (SIT) మరో మెమో దాఖలు చేస్తూ మొత్తం 11 మందిని అదనంగా నిందితులుగా నమోదు చేసింది. అయితే, ఈస్ట్ పీఎస్లో కల్తీ నెయ్యి జరిగిందని ఫిర్యాదు చేసిన అప్పటి జీఎం మురళీకృష్ణపై కూడా కేసు నమోదు కావడం పెద్ద చర్చగా మారింది. దీంతో కేసులో కొత్త మలుపు తిరిగింది. సిట్ నమోదు చేసిన వివరాల ప్రకారం.. టీటీడీ ఉద్యోగులు 7 మంది, ఇతర వ్యక్తులు, అధికారులు నలుగురితో కలిసి ఇప్పటి వరకుక మొత్తం నిందితుల సంఖ్య 11కు చేరింది..
Read Also: Kashmiri garlic benefits: చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెడుతున్న కాశ్మీరీ వెల్లుల్లి
Also Read
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
- TTD Server Issue: టీటీడీ సర్వర్లో సాంకేతిక లోపం.. ఆన్లైన్ టికెట్ల జారీ రద్దు..
2018 నుండి 2024 వరకు టీటీడీ కొనుగోలు విభాగంలో జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర రెడ్డి మరియు మురళీకృష్ణ, SV గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు కూడా కేసులో నిందితులుగా నమోదు చేశారు.. కాగా, తిరుమల దేవస్థానంలో నైవేద్యంగా ఉపయోగించే నెయ్యి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవడంతో నమూనాలను పరీక్షకు పంపించారు.. అందులో కల్తీ నిర్ధారణ కావడంతో కేసు మొదలైంది.. విచారణలో పెద్ద ఎత్తున కొనుగోలు అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయని సిట్ భావిస్తోంది.
మరోవైపు.. ఈ కేసులు కీలక ఆధారాలు సేకరిస్తూ.. సంబంధిత అధికారుల నుండి వివరణ తీసుకుంటూ మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం పరిశీలిస్తోంది. అయితే, టీటీడీ వంటి పవిత్ర సంస్థలో ఇలా ఎలా జరిగింది? అని భక్తులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. నాణ్యత నియంత్రణ వ్యవస్థ ఎందుకు విఫలమైంది? ఇంకా ఎవరెవరు ఇందులో ఉన్నారు? అని దానిపై దృష్టి పెట్టింది.. విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.. తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టనుంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో