Tirumala Brahmotsavam 2024: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. భక్తులకు ఈవో కీలక సూచనలు
- రేపటి నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
- భక్తులకు కీలక సూచనలు చేసిన ఈవో శ్వామలరావు..
Tirumala Brahmotsavam 2024: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది.. ఇక, రేపటి నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. అయితే, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కీలక సూచనలు చేశారు టీటీడీ ఈవో శ్వామలరావు.. రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. వాహన సేవలు ఉదయం 8 గంటలకు, రాత్రి వాహన సేవలు 7 గంటలకు ప్రారంభిస్తాం అని వెల్లడించారు.. పెద్దశేష వాహనం రాత్రి 9 గంటలకు, గరుడ వాహన సేవను సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభిస్తాం.. బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని స్పష్టం చేశారు..
Read Also: Jr.NTR : దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ప్రకటించిన నిర్మాత నాగవంశీ
Also Read
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
- TTD Server Issue: టీటీడీ సర్వర్లో సాంకేతిక లోపం.. ఆన్లైన్ టికెట్ల జారీ రద్దు..
మరోవైపు.. 7 లక్షల లడ్డూ ప్రసాదాలు నిల్వగా వుంచడంతో పాటు లడ్డూల పంపిణీ కోసం అదనంగా 11 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ఈవో శ్వామలరావు తెలిపారు.. 1,200 టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పాటు 3,900 మంది పోలీసులుతో భధ్రతా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.. తిరుమలలో 7 ప్రాంతాలలో 4 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం.. తిరుపతిలో 6 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంటుందన్నారు.. వైద్య సేవల కోసం అదనంగా 45 మంది డాక్టర్లు, 65 మంది మెడికల్ సిబ్బందిని నియమించామని వెల్లడించారు.. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏదైనా సమస్య వస్తే 155257 నెంబర్ తో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు.. ఇక, నిత్యం 400 ఆర్టీసీ బస్సుల ద్వారా 2 వేల ట్రిప్పులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నాం.. 21 రాష్ర్టాల నుంచి విచ్చేసిన 160 కళా బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు.. గరుడ సేవ రోజున సాయంత్రం 6:30 గంటల నుంచి 11:30 గంటల వరకు వాహన సేవ వుంటుందన్నారు.. గరుడ సేవ రోజున 24 గంటల పాటు ఘాట్ రోడ్డు, నడకమార్గాలు తెరిచి వుంచుతాం అని వెల్లడించారు.. నాలుగు వేల మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. భక్తుల సౌకర్యార్థం 28 ప్రాంతాలలో ఎల్ఈడి స్ర్కీన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామలరావు.
తాజావార్తలు
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
-
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
ట్రెండింగ్
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!