Tirumala Brahmotsavam 2024: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. భక్తులకు ఈవో కీలక సూచనలు
- రేపటి నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
- భక్తులకు కీలక సూచనలు చేసిన ఈవో శ్వామలరావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Brahmotsavam 2024: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది.. ఇక, రేపటి నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. అయితే, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కీలక సూచనలు చేశారు టీటీడీ ఈవో శ్వామలరావు.. రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. వాహన సేవలు ఉదయం 8 గంటలకు, రాత్రి వాహన సేవలు 7 గంటలకు ప్రారంభిస్తాం అని వెల్లడించారు.. పెద్దశేష వాహనం రాత్రి 9 గంటలకు, గరుడ వాహన సేవను సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభిస్తాం.. బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని స్పష్టం చేశారు..
Read Also: Jr.NTR : దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ప్రకటించిన నిర్మాత నాగవంశీ
Also Read
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..
- Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
మరోవైపు.. 7 లక్షల లడ్డూ ప్రసాదాలు నిల్వగా వుంచడంతో పాటు లడ్డూల పంపిణీ కోసం అదనంగా 11 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ఈవో శ్వామలరావు తెలిపారు.. 1,200 టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పాటు 3,900 మంది పోలీసులుతో భధ్రతా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.. తిరుమలలో 7 ప్రాంతాలలో 4 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం.. తిరుపతిలో 6 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంటుందన్నారు.. వైద్య సేవల కోసం అదనంగా 45 మంది డాక్టర్లు, 65 మంది మెడికల్ సిబ్బందిని నియమించామని వెల్లడించారు.. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏదైనా సమస్య వస్తే 155257 నెంబర్ తో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు.. ఇక, నిత్యం 400 ఆర్టీసీ బస్సుల ద్వారా 2 వేల ట్రిప్పులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నాం.. 21 రాష్ర్టాల నుంచి విచ్చేసిన 160 కళా బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు.. గరుడ సేవ రోజున సాయంత్రం 6:30 గంటల నుంచి 11:30 గంటల వరకు వాహన సేవ వుంటుందన్నారు.. గరుడ సేవ రోజున 24 గంటల పాటు ఘాట్ రోడ్డు, నడకమార్గాలు తెరిచి వుంచుతాం అని వెల్లడించారు.. నాలుగు వేల మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. భక్తుల సౌకర్యార్థం 28 ప్రాంతాలలో ఎల్ఈడి స్ర్కీన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామలరావు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!