Tirumala: శ్రీవారి భక్తులకు డబుల్ బొనాంజా..!
- తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త..
- వైకుంఠ ద్వార దర్శనంలో ఆన్లైన్ దర్వా దర్శన టికెట్లు..
- అలా టికెట్లు పొందే భక్తులకు ఈసారి డబుల్ బోనాంజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త.. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో ఆన్లైన్ దర్వా దర్శన టికెట్లు పొందే భక్తులకు ఈసారి డబుల్ బోనాంజా లభించునుంది. ఈ ఏడాది సర్వదర్శనం టోకెన్ కూడా ఆన్లైన్ విధానంలోనే జారీ చేస్తున్న నేపథ్యంలో.. ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందే భక్తులు సర్వదర్శనం లేదా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందే సౌలభ్యం కూడా లభించనుంది..
Read Also: Sai Pallavi: రెండు భాగాలుగా సాయిపల్లవి కొత్త సినిమా!
Also Read
కాగా, శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించునుంది టీటీడీ. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. సాధారణంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన దర్శన టోకెన్లను ఆన్లైన్ విధానంలో జారీ చేస్తుంది టీటీడీ.. సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి దర్శన టోకెన్లు ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్ విధానంలో జారీ చేస్తుంది. ఈ ఏడాది జనవరి 8వ తేదీన వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సర్వదర్శనం భక్తులకు దర్శన టోకెన్ల జారీ చేసే సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా 6 మంది భక్తులు మృతి చెందడం.. 50 మందికి పైగా భక్తులు గాయపడటంతో టీటీడీ ఈ విధానానికి స్వస్తి పలికింది. పది రోజులకు సంబంధించి దర్శన టిక్కెట్ల జారీ విధానంలో మార్పులు తీసుకొచ్చింది టీటీడీ.
మొదటి మూడు రోజులపాటు సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించాలని.. మిగిలిన ఏడు రోజుల్లో సర్వదర్శనం భక్తులతో పాటు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు, శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. మరోవైపు సర్వదర్శనం టోకెన్లను ఆఫ్ లైన్ విధానంలో కాకుండా ఆన్లైన్ విధానంలో జారీ చేసేలా ఏర్పాట్లు చేసింది. సర్వదర్శనం భక్తులకు రేపటి నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఆన్లైన విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంది. టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాఫ్ ద్వారా భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. డిసెంబర్ రెండవ తేదీన ఈ డిఫ్ విధానంలో వారికి దర్శన టోకెన్లను జారీ చేయనున్నారు. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆన్లైన్ విధానంలో జారీ చేయనున్నారు. రోజుకి 15 వేలు చొప్పున ఏడు రోజులకు సంబంధించి లక్షా 5 వేల టికెట్లను జారీ చేయనున్నారు.. దీనితో ఆన్లైన్ ద్వారా గతంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మాత్రమే పొందే భక్తులకు.. ఈసారి సర్వదర్శనం టోకెన్లు కూడా పొందే సౌలభ్యం లభించునుంది. దర్శన టోకెన్ కలిగిన భక్తులకు దర్శన సమయంలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేకపోవడం టోకెన్ కలిగిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోనే స్వామివారి దర్శన భాగ్యం లభించునున్న నేపథ్యంలో ఆన్లైన్ భక్తులకు ఇది డబుల్ బొనాంజాగా మారింది..
తాజావార్తలు
-
Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!