Ramana Deekshithulu: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు.. రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు..
- శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు..
- లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరగడం మహా పాపం..
- దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramana Deekshithulu: శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా రోజులు తరువాత మీడియా ముందుకు వచ్చిన రమణధీక్షితులు టీటీడీ లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరగడం మహా పాపం అన్నారు.. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వామివారికి నివేదించే ప్రసాదాల నాణ్యత, పరిణామాలు దిట్టం మేరకు జరగడం లేదని గత ఐదు సంవత్సరాలుగా తాను టీటీడీ ఈవో.. చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లిన సరైన స్పందన లేదని.. ఇప్పటికైనా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడం మంచి పరిణామం అంటూ వ్యాఖ్యలు చేశారు రమణ దీక్షితులు. కోవిడి కాలం నుంచి కూడా స్వామివారికి సమర్పించే నైవేద్యం దిట్టం మేరకు చేయడం లేదని ప్రశ్నించిన తనపై గత ప్రభుత్వంలో అనేక కేసులు పెట్టారని తనపై ఉన్న కేసులను తొలగిస్తే 50 సంవత్సరాల అనుభవంతో పాడైన అర్చక ఆలయ వ్యవస్థలను సరిదిద్దుతానని పేర్కొన్నారు రమణ దీక్షితులు. అయితే, పింక్ డైమండ్ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించిన రమణ దీక్షితులు.. స్వామివారి సేవలో పాల్గొనే అవకాశాన్ని ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కల్పిస్తారన్న నమ్మకం తనకు ఉందని వ్యాఖ్యానించారు.
Read Also: Israel Airstrike : హిజ్బుల్లా స్థావరాలపై విధ్వంసం సృష్టించిన ఇజ్రాయెల్
Also Read
రెండు రోజులుగా తిరుమల క్షేత్రంపై వస్తున్న వార్తలు చాలా బాధాకరం అన్నారు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు.. వేల సంవత్సరాలుగా ఆగమశాస్త్రం మేరకు కైంకర్యాలు జరుగుతున్న శ్రీవారి ఆలయంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు.. స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో కల్తీ జరగడం చాలా పాపం.. ప్రసాదాల నాణ్యత, పరిణామాలు సరిగా లేవని అప్పటి ఈవో, చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదన్నారు.. గత ఐదు సంవత్సరాలుగా నేను ఒంటరి పోరాటం చేశాను.. నా తోటి అర్చకులు సహకరించలేదన్నారు.. తిరుమలలో ప్రక్షాలన చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేసి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.. స్వచ్ఛమైన నెయ్యిని కర్నాటక డైరీ నుంచిసేకరణ చేయాలని టీటీడీ నిర్ణయించడం మంచి పరిణామంగా అభివర్ణించారు.. స్వామివారికి శుచిగా, రుచిగా ప్రసాద సమర్పణ చేస్తే దేశం సుభిక్షంగా వుంటుంది.. సేంద్రియ పదార్ధాలతో ప్రసాదాల చేయాలనే ప్రతిపాదన ఐదు సంవత్సరాల క్రితం నా వద్దకు వచ్చింది.. వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారానికి విరుద్ధంగా చేయడం సమంజసం కాదని వారికి తేల్చి చెప్పానన్నారు. అయితే, ఐదు సంవత్సరాల క్రితం వున్న విధానానే ప్రసాదాల తయారీలో అమలు చేయాలని సూచించారు.. 50 సంవత్సరాలు అనుభవం వుంది.. అవకాశం ఇస్తే పాడైన అర్చక, ఆలయ వ్యవస్థలను సరిదిద్దుతాను.. గత ప్రభుత్వం పెట్టిన కేసులు తొలగిస్తే.. స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు రమణదీక్షితులు..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!