Tirupati Laddu Controversy: సిట్ దర్యాప్తునకు బ్రేక్.. డీజీపీ కీలక వ్యాఖ్యలు..
- సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో దూకుడు తగ్గించిన సిట్..
- ఈ నెల 3వ తేదీ వరకు పోలీస్ గెస్ట్ హౌస్ కే సిట్ పరిమితం..
- 3వ తేదీ వరకు సిట్ విచారణ నిలిపివేశామని ప్రకటించిన డీజీపీ..
- సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Laddu Controversy: ఏపీలో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో దూకుడు తగ్గించింది సిట్.. ఈ నెల 3వ తేదీ వరకు పోలీస్ గెస్ట్ హౌస్కు సిట్ పరిమితంకానుంది.. అయితే, గత మూడు రోజుల్లో కీలకమైన ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు.. ఇక, తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. 3వ తేదీ వరకు సిట్ విచారణ నిలిపివేశామని ప్రకటించారు.. తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు విచారణ ఉంటుందన్నారు.. కల్తీ నెయ్యి పై అంశంపై ఏర్పాటైన సిట్ బృందం పరిశీలన జరుపుతున్న సమయంలో.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు డీజీపీ..
Read Also: Minister Nara Lokesh Praja Darbar: రీసర్వేలో గ్రామకంఠంగా పట్టా భూమి.. మంత్రి లోకేష్కి ఫిర్యాదు
Also Read
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
- TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
మరోవైపు.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లుపై అధికార్లతో సమీక్షించిన డీజేపీ ద్వారకా తిరుమలరావు.. బ్రహ్మోత్సవలు సందర్భంగా మొదటి రోజు సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్ర్తాల సమర్పణ, ఐదోవ రోజు గరుడ వాహన సేవ రోజున అదనంగా భధ్రతా ఏర్పాట్లు చేస్తాం అన్నారు.. నాలుగు వేల మంది పోలీసులతో భధ్రతా ఏర్పాట్లు చేస్తామన్న ఆయన.. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భధ్రతా ఏర్పాట్లు చేశామన్నారు.. అనుమానితులను ముందస్తుగా గుర్తించేలా ఏర్పాట్లు చేస్తాం.. 2700 సీసీ కెమెరాలతో పాటు అదనంగా బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం అన్నారు.. అనుమానితులను గుర్తించేందుకు ఫ్రింగర్ ప్రింట్ వ్యవస్థను వినియోగిస్తాం.. సోషియల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా నిఘా వుంచుతామని పేర్కొన్నారు. గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు విక్షీంచే అవకాశం వుండగా.. అదనంగా 80 వేల మంది భక్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా అనుమతిస్తాం అన్నారు.. 2.5 లక్షల మంది ప్రయాణించేలా గరుడ సేవ రోజున ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం.. భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది.. దసరా సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఏమీ ఉండవని స్పష్టం చేశారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!