Times Now Survey: ఏపీలో ఇప్పుడు ఎన్నికలొస్తే.. వైసీపీదే ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Times Now Navbharat Survey Says That YCP Will Win With Huge Margin In 2024 AP Elections: 2024 ఎన్నికలు మరికొన్ని నెలల్లోనే రాబోతున్నాయి. ఏపీలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాయి. దీంతో.. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరిది పైచేయి కాబోతోంది? ఎవరు అధికారంలోకి వస్తారు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే టైమ్స్ నౌ నవభారత్ తాజాగా ఓ సంచలన రిపోర్ట్ని వెల్లడించింది. ‘జన్ గన్ కా మన్’ పేరుతో ఓ సర్వే నిర్వహించిన ఈ సంస్థ.. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే, వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని ప్రకటించింది. ఏపీలో ఉన్న 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే.. 25కి 24 లేదా 25 వస్తాయని ఆ సర్వేలో తెలిపింది. అంతేకాదు.. దేశంలోనే వైసీపీ అతిపెద్ద మూడో పార్టీగా అవతరించే అవకాశం కూడా ఉందని పేర్కొంది.
Extramarital Affair: ప్రియుడి కోసం భార్య స్కెచ్.. మరో మహిళను రంగంలోకి దింపి..
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ఇక ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మాత్రం.. సున్నా నుంచి ఒక స్థానం మాత్రమే వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ నవభారత్ తన నివేదికలో తెలిపింది. అంతకుమించి ఆ పార్టీ ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. ఇక జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకైతే.. ఒక్క సీటు కూడా రాదని సర్వే అంచనా వేసింది. ఓటు శాతం చూసుకుంటే.. వైసీపీకి 51 శాతానికి పైగా ఓట్లు రావొచ్చని, టీడీపీకి 35-36 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా పార్టీలకు అంతంత మాత్రమే ఓట్లు నమోదయ్యే ఆస్కారం ఉందని ఆ సర్వే చెప్పుకొచ్చింది. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చడం, మేనిఫెస్టోకి కట్టుబడి ఉండటం వల్ల.. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని చెబుతోంది. అందుకే.. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతోందని అంచనా వేసింది. కాగా.. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. 22 లోక్సభ ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలను వైసీపీ గెలుచుకుంది.
Chris Gayle: గేల్, నీకసలు బుద్ధుందా.. విరాట్, రోహిత్ ఫ్యాన్స్ ఫైర్
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!