Tiger Fear: బొబ్బిలిలో పులి సంచారం.. కంటిమీద కునుకులేని జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలను చిరుతపులులు, బెంగాల్ టైగర్లు వణికిస్తున్నాయి. అడవులలో నివసిస్తూ అడవి జంతువులను వేటాడాల్సిన పులి, జనావాసాల మధ్యకు చేరి మైదాన ప్రాంతాల్లో తిరుగుతూ ఇటు అధికారులను అటు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా ముచ్చెమటలు పట్టిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. రెండు రోజుల క్రితం బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలోకి ప్రవేశించి ఒక ఆవు పై దాడి చేసి ఆవు మెడను కొరికి వేసిన పులి, బాడంగి మండలం నుంచి బలిజిపేట మండలం మీదుగా తెర్లాం మండలంలోకి అడుగు పెట్టింది. శుక్రవారం రాత్రి తెర్లాం మండలం గొలుగు వలస గ్రామంలో ఒక ఆవు దూడపై దాడిచేసి మొక్కజొన్న తోటలోకి తీసుకువెళ్లి చంపి ఇటు తెర్లాం వాసులను భయభ్రాంతులకు గురిచేసింది.
Read Also: Arvind Kejriwal: ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ రూ.6,300 కోట్లు ఖర్చు చేసింది..
Also Read
- Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
- Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
- Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
- Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
ఇక్కడ నుంచి ఈ పులి ప్రయాణం ఎటువైపు మలుపు తిరుగుతుందో, ఎక్కడ ఎవరిమీద దాడి చేస్తుందోనని చుట్టుప్రక్కల గ్రామాల వాసులు ఆందోళనకు గురవుతున్నారు. రాత్రిళ్ళు పులి సంచరిస్తున్న ఆనవాళ్ళు సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. దీంతో జనం వణికిపోతున్నారు. ఇదిలా వుంటే రెండురోజుల క్రితమే పులి కనిపించింది. ఎస్.కోట మండలం దొర్లపాలెం, కాపు సొంపురం పొలిమేరల్లో పులి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు.
ఈసమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది. ఘటన స్థలానికి చేరుకుని పులి జాడలను గుర్తించారు. ఇటీవల ఎల్.కోట మండలం మల్లివీడు గ్రామ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు దాటుతుండగా వాహనదారులకు పులి కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా దొర్లపాలెం సమీపంలో మరోసారి పులి కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. శ్రీశైలం ఆలయం సమీపంలో అర్థరాత్రిళ్ళు చిరుత సంచారం కనిపించింది. టోల్ గేట్ సమీపంలో చిరుతపులి దేవస్థానం నైట్ డ్యూటీ సిబ్బందికి కనిపించింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు.
Read Also: Stock Market Analysis: By Prasad Dasari, Founder and CEO, Wealth Tree Group
తాజావార్తలు
-
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
-
Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
-
Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క