Tiger Fear: బొబ్బిలిలో పులి సంచారం.. కంటిమీద కునుకులేని జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలను చిరుతపులులు, బెంగాల్ టైగర్లు వణికిస్తున్నాయి. అడవులలో నివసిస్తూ అడవి జంతువులను వేటాడాల్సిన పులి, జనావాసాల మధ్యకు చేరి మైదాన ప్రాంతాల్లో తిరుగుతూ ఇటు అధికారులను అటు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా ముచ్చెమటలు పట్టిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. రెండు రోజుల క్రితం బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలోకి ప్రవేశించి ఒక ఆవు పై దాడి చేసి ఆవు మెడను కొరికి వేసిన పులి, బాడంగి మండలం నుంచి బలిజిపేట మండలం మీదుగా తెర్లాం మండలంలోకి అడుగు పెట్టింది. శుక్రవారం రాత్రి తెర్లాం మండలం గొలుగు వలస గ్రామంలో ఒక ఆవు దూడపై దాడిచేసి మొక్కజొన్న తోటలోకి తీసుకువెళ్లి చంపి ఇటు తెర్లాం వాసులను భయభ్రాంతులకు గురిచేసింది.
Read Also: Arvind Kejriwal: ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ రూ.6,300 కోట్లు ఖర్చు చేసింది..
Also Read
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
- SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇక్కడ నుంచి ఈ పులి ప్రయాణం ఎటువైపు మలుపు తిరుగుతుందో, ఎక్కడ ఎవరిమీద దాడి చేస్తుందోనని చుట్టుప్రక్కల గ్రామాల వాసులు ఆందోళనకు గురవుతున్నారు. రాత్రిళ్ళు పులి సంచరిస్తున్న ఆనవాళ్ళు సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. దీంతో జనం వణికిపోతున్నారు. ఇదిలా వుంటే రెండురోజుల క్రితమే పులి కనిపించింది. ఎస్.కోట మండలం దొర్లపాలెం, కాపు సొంపురం పొలిమేరల్లో పులి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు.
ఈసమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది. ఘటన స్థలానికి చేరుకుని పులి జాడలను గుర్తించారు. ఇటీవల ఎల్.కోట మండలం మల్లివీడు గ్రామ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు దాటుతుండగా వాహనదారులకు పులి కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా దొర్లపాలెం సమీపంలో మరోసారి పులి కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. శ్రీశైలం ఆలయం సమీపంలో అర్థరాత్రిళ్ళు చిరుత సంచారం కనిపించింది. టోల్ గేట్ సమీపంలో చిరుతపులి దేవస్థానం నైట్ డ్యూటీ సిబ్బందికి కనిపించింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు.
Read Also: Stock Market Analysis: By Prasad Dasari, Founder and CEO, Wealth Tree Group
తాజావార్తలు
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్ఫ్లిక్స్ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..