Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bjp Spent Rs 6300 Crore On Toppling Governments Claims Arvind Kejriwal

Arvind Kejriwal: ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ రూ.6,300 కోట్లు ఖర్చు చేసింది..

Published Date :August 27, 2022 , 3:45 pm
By Mahesh Jakki
Arvind Kejriwal: ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ రూ.6,300 కోట్లు ఖర్చు చేసింది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Arvind Kejriwal: దేశంలోని ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయడానికి బీజేపీ 6,300 కోట్ల రూపాయలను ఖర్చు చేయకపోతే, ఆహార పదార్థాలపై కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధించాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు. ప్రభుత్వాలను వరుసగా హత్య చేస్తు్న్న సీరియల్ కిల్లర్ బీజేపీ అని వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు ఇలా మాట్లాడటం గమనార్హం. జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ద్వారా సేకరించిన డబ్బును ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం బీజేపీ వినియోగిస్తోందని కేజ్రీవాల్ అసెంబ్లీలో తన ప్రసంగంలో ఆరోపించారు.

ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనడానికి, రాష్ట్రాలలో వారి ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ కోట్లాది రూపాయలను ఖర్చు చేయడంతో ప్రజలు ధరల పెరుగుదలను ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్వీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ఆరోపించారు. పెరుగు, మజ్జిగ, తేనె, గోధుమలు, బియ్యం మొదలైన వాటిపై విధించిన జీఎస్టీ వల్ల కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.7,500 కోట్ల ఆదాయం వస్తుందని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. “ప్రభుత్వాలను పడగొట్టడానికి వారు ఇప్పటివరకు ₹ 6,300 కోట్లు ఖర్చు చేశారు. వారు ప్రభుత్వాలను పడగొట్టకపోతే గోధుమలు, బియ్యం, మజ్జిగ మొదలైన వాటిపై జీఎస్టీ విధించాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రజలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.” అని ఆయన పేర్కొన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫార్సు మేరకు ఎక్సైజ్ పాలసీ అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసినప్పటి నుంచి ఆప్, బీజేపీల మధ్య రాజకీయంగా చిచ్చు రాజుకుంది. ఈ కేసుకు సంబంధించి రాజధానిలోని సిసోడియా నివాసంతో పాటు దేశంలోని 30 ఇతర ప్రాంతాల్లో ఆగస్టు 19న దర్యాప్తు సంస్థ దాడులు చేసింది.

JP Nadda meet Mithali Raj: జేపీ నడ్డాతో మిథాలీరాజ్‌భేటీ.. విషయం ఇదేనా..?

అరవింద్ కేజ్రీవాల్‌కు పెరుగుతున్న ప్రజాదరణను, అతని పాలనా నమూనాను చూసి బీజేపీ భయపడి మనీష్ సిసోడియాను నకిలీ కేసులో ఇరికించి అతని ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్రం సీబీఐని పంపిందని ఆప్ ఆరోపించింది. సీబీఐ దాడి జరిగిన ఒక రోజు అనంతరం తనపై ఉన్న అన్ని అవినీతి ఆరోపణలను ఎత్తివేసేందుకు బీజేపీ తనను సంప్రదించిందని, తాను బీజేపీలో చేరితే ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా నియమిస్తానని హామీ ఇచ్చినట్లు మనీష్ సిసోడియా పేర్కొన్నారు.

ఈ వారం ప్రారంభంలో నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని బీజేపీ నాయకులు తమను సంప్రదించారని ఆ ఎమ్మెల్యేలే వెల్లడించారు. లేకుంటే వారు కూడా నకిలీ కేసుల్లో సీబీఐ, ఈడీని ఉంటుందని బెదిరించారని ఆ నలుగురు ఎమ్మెల్యేలు తెలిపారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది. ఇప్పటివరకు 277 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఢిల్లీ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సిసోడియాపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆప్ తప్పుడు వాదనలు చేసిందని బీజేపీ ఆరోపించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aam admi party
  • Arvind Kejriwal
  • Arvind Kejriwal comments
  • Arvind Kejriwal on bjp
  • bjp

తాజావార్తలు

  • Jananayagan Leak : జననాయగన్ లీక్.. విజయ్ కు ఎంతో మేలుచేసినట్టే

  • Newly Weds Death: పెళ్లి జరిగిన తెల్లారే విషాదం.. వధూవరులతో సహా నలుగురు మృతి

  • Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి…

  • Sameera Reddy:ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం లక్షల ఖర్చు.. హీరోయిన్ల పరిస్థితిపై సమీరా రెడ్డి ఆవేదన!

  • Sanju Samson: ధోనీ రికార్డు బద్దలు.. విమర్శకుల నోళ్లు మూయించిన సంజూ!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions