Perni Nani: రాష్ట్రం అంటే అమరావతి అన్నట్లుగా లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారు..
- కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ..
- జగన్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చారు..
- రాష్ట్రం అంటే అమరావతి అన్నట్లుగా లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారు: పేర్నినాని
Perni Nani: కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చారు.. గత జగన్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని ప్రచారం చేశారు.. కలెక్టర్ కార్యాలయాలు కూడా తనఖా పెట్టి అప్పులు చేస్తున్నారని నానా యాగీ చేశారు.. ఇప్పుడు, చంద్రబాబును జాకీలు పెట్టి లేపారు.. ప్రపంచ ఆర్థిక వేత్తలకు కూడా చంద్రబాబు పాఠాలు చెబుతారని చెప్పారు.. చంద్రబాబును సీఎంని చేస్తే ఆయన సంపద సృష్టిస్తారు.. జగన్ చేసిన అప్పులు కూడా తీరుస్తారని డబ్బాలు కొట్టారు.. ఆయనకు వత్తాసు పలికే పవన్ మాటలు నమ్మి ప్రజలు ఓటేశారు.. ఇప్పుడు తలకు మించిన అప్పులు చేస్తున్నారు అని పేర్ని నాని తెలిపారు.
Read Also: India-Pak War: యుద్ధం వస్తే, భారత్-పాకిస్తాన్ బలాబలాలు ఏంత..? ఏ దేశం ఎటువైపు ఉంటుంది..?
ఇక, కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేస్తున్నారని వైసీపీ నేత పేర్నినాని తెలిపారు. మంత్రిగా ఎవరున్నా పద్దతి ప్రకారం అప్పులు తీసుకుంటారు.. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత బరితెగించి అప్పులు చేయటం లేదు.. బిల్డపు బాబాయ్ చంద్రబాబు, చిన్న బిల్డప్ బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎన్నో కథలు చెప్పారు.. అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తానని చెప్తారు.. రాష్ట్రం అంటే అమరావతి మాత్రమే అన్నట్లుగా లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారు.. తగుదునమ్మా అన్నట్లుగా మరో 44 వేల ఎకరాలు భూములు తీసుకుంటున్నారు.. అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు అని ప్రశ్నించారు. మోసపూరిత మాటలతో ఓట్లు వేయించుకుని మీ సంపద పెంచుకుంటున్నారు.. ఇవాళ చూస్తే చంద్రబాబు ఆస్తులు పెరిగాయి.. స్పెషల్ ఫ్లైట్ తిరుగుతున్నారు.. డిప్యూటీ సీఎం విమానాలు, హెలిక్రాఫ్టర్లలో తిరుగుతున్నారంటూ పేర్నినాని మండిపడ్డారు.
Read Also: Deputy CM Pawan: మోడీ, చంద్రబాబు సారథ్యంలో పిఠాపురం అభివృద్ధిలో దూసుకుపోతుంది..
ఇక, జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు 3.32 లక్షల కోట్లు అని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభుత్వం సరాసరి అప్పులు 1.03 లక్షల కోట్లు చేసిందన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పు 40 వేల కోట్లు.. జగన్ తెచ్చిన అప్పుల్లో 2.70 లక్షల కోట్లు డీబీటీల ద్వారా ప్రజలకు ఇచ్చారు.. జగన్ చేసిన అప్పులకు లెక్కుంది.. ఏడాది కూడా తిరక్కముందే 1.47 లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారు అని ప్రశ్నించారు. ఇక, చంద్రబాబు వాళ్ల అబ్బాయి లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు.. హామీలు అడిగితే భయం వేస్తుంది అని చెబుతారు.. ఇప్పుడేమో చెవిలో చెప్పాలి అంటున్నారు.. రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేయటం కోసం జీవో కూడా విడుదల చేస్తున్నారని పేర్నినాని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ సూపర్ విక్టరీ..
-
Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్నే మించిపోయాడు.. ఐపీఎల్లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!
-
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్సింగ్ అక్కడ కూడా ఫ్లాపేనా?
-
Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్
-
Mahesh Babu: రాజమౌళి మహేశ్కు పాస్పోర్ట్ ఇచ్చేశాడా?
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!