Perni Nani: రాష్ట్రం అంటే అమరావతి అన్నట్లుగా లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారు..
- కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ..
- జగన్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చారు..
- రాష్ట్రం అంటే అమరావతి అన్నట్లుగా లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారు: పేర్నినాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చారు.. గత జగన్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని ప్రచారం చేశారు.. కలెక్టర్ కార్యాలయాలు కూడా తనఖా పెట్టి అప్పులు చేస్తున్నారని నానా యాగీ చేశారు.. ఇప్పుడు, చంద్రబాబును జాకీలు పెట్టి లేపారు.. ప్రపంచ ఆర్థిక వేత్తలకు కూడా చంద్రబాబు పాఠాలు చెబుతారని చెప్పారు.. చంద్రబాబును సీఎంని చేస్తే ఆయన సంపద సృష్టిస్తారు.. జగన్ చేసిన అప్పులు కూడా తీరుస్తారని డబ్బాలు కొట్టారు.. ఆయనకు వత్తాసు పలికే పవన్ మాటలు నమ్మి ప్రజలు ఓటేశారు.. ఇప్పుడు తలకు మించిన అప్పులు చేస్తున్నారు అని పేర్ని నాని తెలిపారు.
Read Also: India-Pak War: యుద్ధం వస్తే, భారత్-పాకిస్తాన్ బలాబలాలు ఏంత..? ఏ దేశం ఎటువైపు ఉంటుంది..?
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
ఇక, కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేస్తున్నారని వైసీపీ నేత పేర్నినాని తెలిపారు. మంత్రిగా ఎవరున్నా పద్దతి ప్రకారం అప్పులు తీసుకుంటారు.. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత బరితెగించి అప్పులు చేయటం లేదు.. బిల్డపు బాబాయ్ చంద్రబాబు, చిన్న బిల్డప్ బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎన్నో కథలు చెప్పారు.. అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తానని చెప్తారు.. రాష్ట్రం అంటే అమరావతి మాత్రమే అన్నట్లుగా లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారు.. తగుదునమ్మా అన్నట్లుగా మరో 44 వేల ఎకరాలు భూములు తీసుకుంటున్నారు.. అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు అని ప్రశ్నించారు. మోసపూరిత మాటలతో ఓట్లు వేయించుకుని మీ సంపద పెంచుకుంటున్నారు.. ఇవాళ చూస్తే చంద్రబాబు ఆస్తులు పెరిగాయి.. స్పెషల్ ఫ్లైట్ తిరుగుతున్నారు.. డిప్యూటీ సీఎం విమానాలు, హెలిక్రాఫ్టర్లలో తిరుగుతున్నారంటూ పేర్నినాని మండిపడ్డారు.
Read Also: Deputy CM Pawan: మోడీ, చంద్రబాబు సారథ్యంలో పిఠాపురం అభివృద్ధిలో దూసుకుపోతుంది..
ఇక, జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు 3.32 లక్షల కోట్లు అని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభుత్వం సరాసరి అప్పులు 1.03 లక్షల కోట్లు చేసిందన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పు 40 వేల కోట్లు.. జగన్ తెచ్చిన అప్పుల్లో 2.70 లక్షల కోట్లు డీబీటీల ద్వారా ప్రజలకు ఇచ్చారు.. జగన్ చేసిన అప్పులకు లెక్కుంది.. ఏడాది కూడా తిరక్కముందే 1.47 లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారు అని ప్రశ్నించారు. ఇక, చంద్రబాబు వాళ్ల అబ్బాయి లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు.. హామీలు అడిగితే భయం వేస్తుంది అని చెబుతారు.. ఇప్పుడేమో చెవిలో చెప్పాలి అంటున్నారు.. రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేయటం కోసం జీవో కూడా విడుదల చేస్తున్నారని పేర్నినాని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!