TIRUMALA: ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహోత్సవాలు.. సెప్టెంబర్లో సాలకట్ల, అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TIRUMALA: తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరుని ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాంటిది బ్రహోత్సవాలల్లో దర్శించుకునే భాగ్యం కలిగితే ఇంకెంత పుణ్యమో అనుకుంటారు. అయితే ప్రతి ఏడాది లాగా కాకుండా.. ఈ ఏడాది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి రెండు బ్రహోత్సవాలు జరగనున్నాయి. అధికమాసం రావడంతో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహోత్సవాలను నిర్వహించనున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై శ్రీవెంకటేశ్వర స్వామికి ఈ ఏడాది రెండు బ్రహోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ నెలలో ఒక బ్రహోత్సవం జరగనుండగా.. అక్టోబర్లో నవరాత్రి బ్రహోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 16వ తేది వరకు సాలకట్ల బ్రహోత్సవాలు జరగనుండగా.. అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి బ్రహోత్సవాల తేదిలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. తిరుమల శ్రీనివాసుడికి ఈఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈఏడాది అధికమాసం సందర్భంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా సెప్టెంబరు 18న ధ్వజారోహణం, 22న గరుడవాహన సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం(మహారథం), 26న చక్రస్నానం, ధ్వజావరోహణం ఉంటాయని టీటీడీ ప్రకటించింది.
Read also: Asia Cup 2023: అభిమానులకు శుభవార్త.. ఉచితంగానే ఆసియా కప్ మ్యాచ్లు చూడొచ్చు!
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19న గరుడవాహనం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం ఉంటాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీవరకు, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్నవారికి, నిర్దేశిత వాహన సేవలకు మాత్రమే అనుమతించనున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబర్ 14న సహస్రదీపాలంకార సేవను రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!